ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లా బృందావన్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని కృష్ణ కుటీర్లోని నిరుపేద మహిళలతో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మాట్లాడారు. వితంతువులు, నిరుపేద మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు దేశం ముందుకు రావాలన్నారు.
యూపీ ప్రభుత్వం నిరుపేదలు, వితంతువులకు సాయం చేస్తోందని.. గోరఖ్పూర్, వారణాసి సహా లక్నో వంటి ఇతర ప్రాంతాలలో కూడా అలాంటి ఆశ్రమాలను ఏర్పాటు చేసిందని రాష్ట్రపతి అన్నారు.
వితంతువులు పునర్వివాహం, నిరుపేద మహిళల సమస్యలపై, అలాగే వారి ఆర్థిక స్వాతంత్య్రం కోసం సామాజిక మద్దతుపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రస్తావించారు, అందరి మద్దతు ఉంటే ఈ మహిళలు గౌరవంగా, ఆత్మగౌరవంతో నిండైన జీవితాన్ని గడపవచ్చని అన్నారు.
చిన్నవయసులోనే వితంతువులైన మహిళలకు పునర్వివాహం చేయాలని గవర్నర్ ఆనందీబెన్ అన్నారు. కృష్ణ కుటీర్ కు చెందిన మహిళ తమ అనుభవాలను పంచుకుంటూ.. తమకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో రాష్ట్రపతితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. అంతకుముందు కోవింద్ బృందావన్లోని బాంకీ బిహారీ ఆలయంలో ప్రార్థనలు చేశారు.