ఈ పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా బిజెపికి ఓటు వేసి గెలిపించాలని చాలామంది వివిధ రంగాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 10 సంవత్సరాల కాలంలో బిజెపి ప్రభుత్వం సాధించిన విజయాలు గమనించి
ఓటు వేయాలని సూచిస్తున్నారు. వివిధ రంగాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన విషయాలను గమనించినట్లయితే ఈ విషయం అర్థం అవుతుంది.
ప్రజల జీవన ప్రమాణాలను ఒకసారి చూద్దాం.
50 కోట్ల నిరుపేదలకు జన్ ధన్ బ్యాంక్ అకౌంట్ల ఏర్పాటు,,
ఉజ్వల పథకం కింద 10.3 కోట్ల మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు,,
గ్రామాల్లో సురక్షిత తాగునీరు అందించేందుకు 14 కోట్ల గృహాలకు కుళాయి సరఫరా,,
స్వచ్ఛభారత్ కింద దేశవ్యాప్తంగా 12 కోట్ల టాయిలెట్ల ఏర్పాటు ,,
పేద మధ్యతరగతి వ్యాపారుల కోసం 43 కోట్ల రూపాయలు మందికి ముద్ర రుణాల విడుదల,,
పీఎం కిసాన్ పథకం కింద 11.8 కోట్ల రైతులకు ఆర్థిక సహాయం,,
పీఎం ఆవాస్ యోజన పథకం కింద నాలుగు కోట్ల కుటుంబాల ఇళ్ళ నిర్మాణానికి సహాయం,,
దేశవ్యాప్తంగా ఆడపిల్లలకు పురోగతి కోసం 2.7 కోట్ల సుకన్య సమృద్ధి అకౌంట్ ల ఏర్పాటు ,
నగదు బదిలీ విధానం కింద 34 లక్షల కోట్ల రూపాయలు పేదల కుటుంబాలకు నేరుగా అందజేయడం,,
2.86 కోట్ల ఇళ్ళకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా,,
వృద్ధుల్ని ఆదుకునేందుకు అటల్ పెన్షన్ యోజన కింద 1.78 కోట్ల మందికి నిరంతరాయంగా పింఛన్లు,,
మొత్తంగా 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి ,,
పీఎం ఫసల్ యోజన కింద నాలుగు కోట్ల రైతులకు బీమా సౌకర్యం,,
ఆహార భద్రత కింద 80 కోట్ల మంది ప్రజానీకానికి ఆహార పదార్థాల పంపిణీ
చేయడం ద్వారా దేశవ్యాప్తంగా దిగువ మధ్యతరగతి ప్రజానీకానికి ఎన్నో ప్రయోజనాలు కలిగాయి.
ఇక దేవాలయాలపరంగా వచ్చిన అద్భుతమైన మార్పులను చూద్దాం. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం,, కాశీలో విశ్వనాథ్ కారిడార్ పేరిట వసతుల మెరుగుదల,, ఉజ్జయిని పుణ్యక్షేత్రంలో మహాకాళి దేవాలయం అభివృద్ధి,, కేదార్నాథ్ క్షేత్రంలో వసతులు మెరుగుదల,, సోమనాథ్ దేవాలయం విస్తారంగా అభివృద్ధి,, కాశ్మీర్లో శారదా దేవి ఆలయం లో వసతుల మెరుగుదల చేయడం జరిగింది.
ఆర్థిక రంగం పరంగా భారత ప్రగతిని చూస్తే చాలా విషయాలు అర్థమవుతాయి.
ప్రపంచంలోని టాప్ ఫైవ్ దేశాల్లో ఒకటిగా గుర్తింపు,,
సగటున కుటుంబాల ఆదాయం 50% పెరుగుదల,,
పటిష్టవంతంగా జిఎస్టి అమలు,,
జిడిపిలో 1.7% వృద్ధి,,
ఎగుమతుల్లో మూడు రెట్లు పెరుగుదల.. అంటే 22.7 బిలియన్ డాలర్లు,
ద్రవ్యోల్బణంలో సగానికి సగం తగ్గుదల అంటే ఐదు శాతం మాత్రమే ,,
10 సంవత్సరాల కాలంలో 1.17 లక్షల కొత్త స్టార్టప్ ల ఏర్పాటు,,
అద్భుతంగా డిజిటల్ పేమెంట్ ల వ్యవస్థను ప్రాచుర్యంలోకి తేవడం ద్వారా నల్లధనం సరఫరాకు అడ్డుకట్ట,,
భారత్ లో యాపిల్ శాంసంగ్ వంటి ప్రఖ్యాత కంపెనీల యూనిట్లు,
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఫ్యాన్ ఫోన్ల తయారీ దేశంగా గుర్తింపు,
ఆటోమొబైల్ రంగంలో మూడో అతిపెద్ద మార్కెట్ గా గుర్తింపు..
వంటివి సాధించడం ద్వారా ఆర్థిక రంగంలో అద్భుతమైన ప్రగతి సాధ్యమైంది.
ఆరోగ్య రంగంలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలు చూస్తే చప్పట్లు కొట్టాల్సిందే.
ఆయుష్మాన్ భారత్ కింద 55 కోట్ల మందికి లబ్ధి,,
కొత్తగా ఏడు ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు,
16 ఎయిమ్స్ ఆస్పత్రుల విస్తరణ,
చౌకగా మందుల అందించే జన ఔషధీ స్టోర్ లు పదివేలకు పైగా ఏర్పాటు,,
మొత్తంగా ఆరోగ్య రంగంలో 90 కోట్ల రూపాయల మేర ఖర్చు ,,
692 కొత్త వైద్య కళాశాల ఏర్పాటు,,
భారత్ అంతట కరోనా మీద పూర్తిస్థాయిలో విజయం, 100కు పైగా దేశాలకు టీకాలు సరఫరా
చేయడం ద్వారా అందరి ప్రశంసలు అందుకోవడం జరిగింది.
విద్య రంగంలో మోడీ ప్రభుత్వం విజయాలు అన్నీఇన్నీ కావు.
జాతీయ విద్యా విధానం ప్రయాణం ప్రారంభం,,
విద్యారంగానికి అందిస్తున్న బడ్జెట్ 25 లక్షల కోట్లకు పెంపు,
ఏడు కొత్త ఐఐటీలు, ఏడు కొత్త ఐఏఎంలు, 16 ట్రిపుల్ ఐ టి లకు ప్రారంభం,,
ఒక మాటలో చెప్పాలి అంటే గడచిన పదేళ్లలో వారానికి ఒక కొత్త యూనివర్సిటీ, రెండు కొత్త కాలేజ్ ల ఏర్పాటు,,
మారుమూల లడక్ లో సైతం యూనివర్సిటీ ఏర్పాటు,,
120 కి పైగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు,
నైపుణ్యాల శిక్షణ కింద 1.4 కోట్ల మంది యువతకు నైపుణ్యాల శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పన,,
ఉన్నత విద్యలో బాలికలను ప్రోత్సహించడంతో మహిళల చదువులో 28% వృద్ధి
సాధించి అందరి ప్రశంసలు పొందడం జరిగింది.
ఇక ప్రపంచ దేశాల నడుమ భారత్ ఖ్యాతి ఎలా ఉందో చూద్దాం.
జి 20 కూటమికి నాయకత్వం,,
సంక్లిష్ట కాలంలో చొరవ చూపించి చమురు సరఫరాకు మార్గం సుగమం ,,
బ్రిక్స్ కూటమికి వ్యవస్థాపక సభ్యత్వం,,
విదేశాల్లో చిక్కుకున్న వందల మంది భారతీయుల్ని భారత్ కు చేరవేత,,
క్వార్డు దేశాల కూటమి ఏర్పాటు
పొరుగు దేశాలైన చైనా , పాకిస్థాన్ లకు ధీటుగా వ్యవస్థల ఏర్పాట్లు
చేయడం ద్వారా ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మార్మోగిపోతుంది.
దేశంలో మౌలిక వసతుల రంగంలో సాధించిన ప్రగతిని తప్పకుండా గమనించాల్సిందే.
29,200 కిలోమీటర్లు మేర అద్భుతమైన జాతీయ రహదారుల నిర్మాణం,,
82 కు పైగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులు ,,
6.8 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ విస్తరణ,,
15 కొత్త నగరాల్లో మెట్రో రైల్ సౌకర్యం ,
38 వేల కిలోమీటర్ల రైల్ మార్గాల్లో విద్యుదీకరణ ,,
టోల్ ప్లాజాల డిజిటలీకరణ, ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థ తో నిమిషం లోపే వాహనం ముందుకు కదిలే సౌకర్యం, ఉదాన్ పథకం కింద 1.3 కోట్ల కొత్త ప్రయాణికులు విమాన ప్రయాణం, 84 కోట్ల మేర బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ల ఏర్పాటు,, అత్యంత పొడవైన సుదర్శన్ శేతు కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం
చేయడం ద్వారా అందరి తో శభాష్ అనిపించుకున్నారు.
ఇక రక్షణ రంగంలో అయితే అద్భుతమైన విజయాలు సాధించిన మోదీ ప్రభుత్వ పనితీరును చూద్దాం.
భారతదేశ చరిత్రలో మొదటిసారిగా సరిహద్దులు దాటి బయటకు వెళ్లి శత్రువుల వెన్ను విరిచేట్లుగా సర్జికల్ స్ట్రైక్స్ ,,
రక్షణ రంగంలో భారీగా పెట్టుబడుల ఏర్పాటు,
రక్షణ రంగా స్టార్ట్ అప్ ల కోసం 500 కోట్ల రూపాయల ప్రత్యేక నిధి ,,
రక్షణ రంగ ఎగుమతుల్లో 334% పెరుగుదల,,
సైనిక సోదరుల కోసం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం అమలు చేసి 21 లక్షల పెన్షన్ దారులకు ప్రయోజనం,,
నేషనల్ వార్ మెమోరియల్ ఏర్పాటు ద్వారా సైనిక రంగానికి విస్తారంగా ఖ్యాతి,
దేశ చరిత్రలోనే అత్యంత గరిష్టంగా 21 083 కోట్ల మేర రక్షణ రంగ ఎగుమతులు
చేసి సైనికుల్లో ధైర్యాన్ని నింపి దేశాన్ని భద్రత పరంగా పటిష్టం చేశారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విజయాలు కళ్ళ ముందు కదలాడుతాయి, మరి మూడోసారి బిజెపికి ఓటు వేసినట్లయితే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చుకున్నట్లైతే మరిన్ని అంశాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించడానికి వీలవుతుంది అని వివిధ రంగాల నిపుణులు చెబుతున్నారు. మరి ఇప్పుడు ఆలోచించుకోవాల్సిందే మన ఓటర్లే.