స్వాతంత్రం వచ్చిన దగ్గరనుండి కాశ్మీర్ ఒక ప్రత్యేక సమస్య, కాశ్మీర్ పాకిస్తాన్ లో కలవాలని వాదించే వారు కొందరైతే, కాశ్మీరును ప్రత్యేక దేశంగా నిర్మాణం చేయాలని ప్రయత్నించేవారు మరికొందరు, అసలు సవాలు వేల సంవత్సరాల నుండి భారత్ లో అంతర్భాగం గా ఉన్న కాశ్మీరును ఎట్లా వేరుచేస్తారు అనే ప్రశ్న. భారతదేశంలో వేద కాలం నుండి వేద విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లిన కాశీ, కాశ్మీర్ ఈ రెండు ఈ దేశం యొక్క ఆత్మ అని చెప్పవచ్చు. ఈ దేశంలో వేదమే ప్రమాణము అటువంటి వేదవిద్య కేంద్రమైన కశ్మీర్ ఎప్పుడు భారతదేశంలో అంతర్భాగమే,చరిత్రను అనేక రకరకాలుగా వక్రీకరణలు చేసి రావణకాష్టంగా చేసిన శక్తులు ఒక ప్రక్క పాకిస్తాన్ మరోప్రక్క ఈ దేశంలోని వామపక్ష మేధావులు ఇంకొక ప్రక్క కాంగ్రెస్ మొదలైన సెక్యులర్ పార్టీల అధికార కుతంత్రాలు, ఈ శక్తుల ఆట మధ్యలో కశ్మీర్ నలిగిపోతున్నది.
1980 సంవత్సరంలో పాకిస్థాన్ పాలకుడైన జియాహుల్ హక్ రెండుకుట్రలు పన్నాడు 1)pok లో భాగమైన గిల్గిట్ బాల్తిస్తాన్ లో షియా ముస్లిం లను మైనారిటీ చేసి సున్ని ముస్లింల ఆధిపత్యం సాధించటం 2) కశ్మీరు లోయ నుండి హిందువులను తరిమివేసి కాశ్మీరులోయను ఆక్రమించుకోవ డంరెండిటికి చాలా పెద్ద కుట్ర పన్నాడు. కశ్మీర్లోయ అక్రమణ ఆపరేషన్ TUPAC కోడ్ తో ప్రారంభించబడింది. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ISI) గూడచారి సమస్థకు ఈ పని అప్పగించబడింది. ఆ పనికి మూడు లక్ష్యాలు నిర్దేశించబడ్డాయి 1) పాకిస్థాన్ సైన్యం ఐఎస్ఐ గూడచారి సంస్థ రెండూ కలిసి పని చేయాలి 2) ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న” గ్లోబల్ ముజాహిదీన్” కేంద్రంగా నియంత్రణ రేఖ కు సమీపంలో ఉగ్రవాద శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం 3) కాశ్మీర్ యువతను వేర్పాటువాదులు గా ఉగ్రవాదులు గా శిక్షణ ఇచ్చి అంతర్గత సంఘర్షణకు తెర లేపటం. ఈ విషయాలన్నీ ప్యారేలాల్ కౌల్ వ్రాసిన ”CRISIS IN KASHMIR” పుస్తకం ద్వారా తెలుస్తున్నాయి. ఆ సమయంలో అంటే 1990 లో కాశ్మీరులోని ”జమాయత్-ఈ -ఇస్లాం” అనే ఉగ్రవాద సంస్థ ఉర్దూలోHijab Islam పేరుతో ఒక పుస్తకం ప్రచురించింది. ఆ పుస్తకం కాశ్మీరులోయలో యువతకు రహస్యంగా పంపిణీ చేసింది, అదే కశ్మీర్ ఆక్రమణకు పాకిస్తాన్ కార్యాచరణ ప్రణాళిక, తక్కువ సమయంలోనే ఆ పుస్తకం కాశ్మీరులోయలో మారణకాండకు తెరలేపింది . 1990 జనవరి 19న రాత్రి 9 గంటలకుకశ్మీరులోయలో ని అన్ని మసీదుల నుండి ఒక ప్రకటన వెలువడింది దాని సారాంశంకశ్మీర్ పండిట్స్ కాఫిర్లు అంటే దైవ ద్రోహులు, వాళ్లకు మూడు మార్గాలున్నాయి 1) కశ్మీరు లోయను వదిలిపెట్టి పారిపోవడం 2) ముస్లిములుగా మతం మారటం 3) లేకపోతే చనిపోవటానికి సిద్ధపడటం. మీరంతా మీ మహిళలను వదిలి పారిపోండి. ఆ సమయంలో పదివేల మందికి పైగా ముస్లిములు అందులో మహిళలు పిల్లలు వృద్ధులు అందరూ ఒక్కసారిగా రోడ్డెక్కి దాడులు చేయడం ప్రారంభించారు అట్లా రచన చేయబడిన దారుణమైన సంఘటన అది అట్లా 1990 సంవత్సరం లో చోటు చేసుకున్న దారుణమైన రచనను ఇతివృత్తం తీసుకుని నిర్మించబడిన చిత్రమే ”కశ్మీర్ ఫైల్స్” ఆ చిత్రం సమకాలీన చరిత్ర చెప్పే సత్యం. అది ఈ మధ్య విడుదలైనది, అది దేశమంతా ప్రకంపనాలు సృష్టిస్తుంది. ఎటువంటి కల్పితాలు కల్పన లు లేకుండా ఈ చిత్రం నిర్మించబడింది. ఈ చిత్ర నిర్మాత వివేక్ అగ్నిహోత్ర 700 మంది కాశ్మీరు పండితులను అందులో లో అత్యాచారాలకు గురి అయినటువంటికుటుంబాలవారిని కలిసి అప్పటి వాస్తవ చరిత్రను తెలుసుకొని దాని ఆధారంగా ఆధారంగా ఈ చిత్రం నిర్మించారు.
కాశ్మీర్ ఫైల్స్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు ఎందుకు?
1990 సంవత్సరంలో జరిగిన మారణకాండను నిజాయితీగా ఒకసారి తొంగి చూడటమే నా చిత్రం యొక్క లక్ష్యం అని ఆ చిత్ర నిర్మాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి షూటింగ్ మొదటి రోజు ప్రకటించాడు. ఈ చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది , మరో ప్రక్క వెల్లువెత్తుతున్న విమర్శలను కూడా ఎదుర్కొంటున్నది. ఈ చిత్రాన్ని న్యాయస్థానాలలో ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యాలు కూడా వేయబడ్డాయి, వారి ప్రధాన ఆరోపణ ఈ చిత్రం హిందూ ముస్లింల మధ్య కల్లోలం సృష్టిస్తుందని,కశ్మీర్ పండితులనుఊచ కోత కోసిన హంతకులుగా ముస్లిములను చిత్రీకరించి మా మనోభావాలను ఈ చిత్ర దర్శకుడు గాయపరిచాడు అందుకే ఈ సినిమా ఆపి వేయాలని బొంబాయి లోని ఒక ఉత్తర ప్రదేశ్ వ్యక్తి ముంబాయిహైకోర్టు కు వెళ్ళాడు , ముంబై హైకోర్టు ధర్మాసనంఆ పిల్ ను కొట్టి వేసింది. ఈ విధంగా ఒకపక్క పెద్ద ఎత్తున ప్రజలు ఆ సినిమాను చూస్తుంటే ఇంకొక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అట్లాగే ఈ సినిమా మరో వాస్తవాన్ని తెర మీదకు తెచ్చింది ఆ సమయంలో పాలకులు మీడియా ఎంత అమానవీయంగా వ్యవహరించిందో ఎలా సంఘటనలను వక్రీకరించిందో అందులోను వామపక్ష మేధావులు పాత్రను అర్థం చేయించేందుకు ప్రయత్నం జరిగింది. దానిని అర్థం చేసుకోవాలంటే వాస్తవ చరిత్ర తెలుసుకోవాలి దాని లక్ష్యమే ఈ సినిమా, విమర్శకులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. కశ్మీర్ అంటే భూతల స్వర్గం అన్న విషయం ప్రపంచానికి తెలియజేసే విధంగా ఎన్నో అందాలను కెమెరాలో బంధించారు, విమర్శలు చేసే వారికి వక్రీకరించి బడిన చరిత్రే ఆధారం,
చరిత్ర వక్రీకరణ కు కారకులు ఎవరు?
1947 ఆగస్టు 14న జరిగిన దేశ విభజనతో తలెత్తిన పరిణామా లు మరో ప్రక్క దేశంలో ఉన్న అన్ని సంస్థానాలను ఇండియన్ యూనియన్ లో కలపటం జరుగుతున్న సమయంలో కశ్మీరు రాజు ఎటువంటి షరతులు లేకుండా దానిని ఇండియన్ యూనియన్ లో కలిపేందుకు సంతకం చేశాడు, అయినా ఎందుకు క శ్మీర్ సమస్యాత్మక మైంది? దానికి ప్రధాన కారణం నెహ్రూ, నెహ్రూ కారణంగా కాశ్మీర్ విలీనం ఆలస్యం కావడం, పాకిస్తాన్ కాశ్మీర్ ను ఆక్రమించుకోవడానికి సైన్యాన్నిమారువేషంలో పంపటం, దానిని ఎదుర్కొనేందుకు భారత సైన్యం రంగంలోకి దిగటం, భారత సైన్యం పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొడుతూ ఉంటె జవహర్ లాల్ నెహ్రు అకస్మాత్తుగా యుద్ధ విరమణ ప్రకటించటం, దానికారణంగా కశ్మీర్ లోని కొంత భూభాగం పాకిస్తాన్ అధీనం లో ఉన్నది దానినే POK అంటున్నాము దీనికి కారణం జవహర్లాల్ నెహ్రూ కు కాశ్మీరు రాజు పై ఉన్న వ్యక్తిగత ద్వేషం, ఇంకో ప్రక్క స్వాతంత్ర పోరాట కాలం నుంచి కొనసాగుతున్న ముస్లిం సంతుష్టీకరణ. అది దాని పరాకాష్ట. స్వాతంత్రానంతరం కూడా ముస్లిం సంతుష్టీకరణ భారత దేశ రాజకీయాలను ఎంత ప్రభావితం చేస్తుందో ఈరోజు కూడా మనం చూస్తున్నాం , ఈ సంతుష్టి కరణ ను ఎగదోస్తూ ఉన్నవాళ్ళు వామపక్ష మేధావులు ఉదారవాద మేధావులు, వీరి కారణంగా దేశ ప్రజల మధ్యలో ఒక విభజన రేఖ గీయబడింది, ఆ విద్వేషం దాడులకు కారణం అవుతోంది దేశ భద్రతకు ముప్పు గా కూడా పరిణమించింది. ఇటువంటి పరిస్థితులకు దారితీసిన అంశం కశ్మీరు సమస్య. దీనిలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పాత్ర కూడా చాలా ఉంది, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ దేశంలో కొత్త కొత్త సైద్ధాంతిక సంఘర్షణలకు తెర లేపుతోంది, దీనిని అర్థం చేసుకోవాలి అంటే కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. 2001వ సంవత్సరంలో పార్లమెంట్ మీద జరిగిన దాడి లో ప్రధాన సూత్రధారి అఫ్జల్ గురు ఇతను jnu యూనివర్సిటీ విద్యార్థి, దాడి పై జరిగిన న్యాయవిచారణలో సుప్రీం కోర్ట్ అతనికి మరణశిక్ష విధించింది, దానిని 2013 ఫిబ్రవరి 13న అమలు చేసారు. 2016 సంవత్సరంలో అఫ్జల్ గురును ఉరి తీసిన రోజు పెద్ద ఎత్తున JNU విద్యార్థులు ప్రదర్శన చేశారు అది ఈ దేశంలో సైద్ధాంతిక సంఘర్షణకు మరింత ఆజ్యం పోసింది. ఇప్పటికీ JNU లో ఉండే కొందరు అఫ్జల్ గురును ఒక స్వతంత్ర యోధుడు గా భావిస్తూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు, 2016 న జరిగిన ప్రదర్శనలో ఈ దేశ వ్యతిరేక నినాదాలు చేయబడ్డాయి. భారత దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తాం, బుర్హాన్ వలీ ఆజాది, గిలానీ ఆజాదీ మీరు ఎంతమంది ఆఫ్జల్ గురు లను చంపుతారు కశ్మీరు లో ప్రతి ఇంటి నుండి ఒక ఆఫ్జల్ గురు పుట్టుకొస్తాడు అని అరిచాఋ ఇవన్నీ గమనిస్తూ ఉంటేJNU విద్వేషాలు నిర్మాణం చేసే ఒక పెద్ద కేంద్రంగా, కాశ్మీర్ సంఘర్షణలో జిహాదీ లకు ఒక పెద్ద మదర్సా కేంద్రంగా చెప్పవచ్చు, ఇట్లా చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, 1990 సంవత్సరంలో కాశ్మీర్ లోయ నుండి పండితులను తరిమివేయడానికి ప్రధాన సూత్రధారి JKLF నాయకుడు ఫరూక్ అహ్మద్ బిట్టా కరాటే 2003 సంవత్సరం పుల్వామాలో బస్సులో ప్రయాణిస్తున్న కశ్మీర్పండిట్ కుటుంబాలను స్త్రీలు, పిల్లలు అనే కనికరం కూడా లేకుండా 23 మందిని కాల్చి చంపిన సంఘటన, 1990 లో ప్రారంభంలో 25 మంది పండితుల చంపినట్టు కోర్టులో అతను అంగీకరించాడు, అయినా అతనిపై ఆరోపణ నిరూపించ బడలేదు దాని కారణంగా అతన్ని 2019 సంవత్సరంలో నిర్దోషిగా విడుదల చేశారు. అతనే మళ్లీ 2019 లో జరిగిన కారు బాంబు పేలుళ్ల లో 40 మంది పారామిలటరీ వాళ్ళు చనిపోవటానికి అనుమానితుడు. ఈ విధంగా ఈ దేశంలోని దేశ వ్యతిరేక శక్తుల కార్యకలాపాలు సాగుతున్నాయి.
ముగింపు
కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఇప్పటికే 370 ఆర్టికల్, 12A ను రద్దు చేసింది పార్లమెంట్. చరిత్రను విస్మరించి, చరిత్ర వక్రీకరణ చేసిన ప్రచారం కారణంగా ఈ దేశంలోఎంతోమంది దేశద్రోహులు పుట్టుకొచ్చారు, ఎంతో మంది చనిపోయిన ఈ విషయాలను ఆలోచించే పరిస్థితులో కూడా వామపక్ష మేధావులు, ఉదారవాద మేధావులు లేరు. చరిత్ర విస్మరిస్తే , చరిత్రను వక్రీకరిస్తే ఆ చరిత్ర తిరగబడుతుంది అని కాంగ్రెస్ వామపక్ష సిద్ధాంతకర్తలు ఉదారవాద మేధావులు ఎప్పుడు గ్రహిస్తారో? మరింత విధ్వంసం జరిగితే గాని గ్రహించరేమో ఈ సైద్ధాంతిక సంఘర్షణకు దేశం యొక్క అంతర్గత భద్రతకు ప్రమాద కరంగా ఉన్నది . తమ సొంత స్థలం నుంచి తరిమి వేయబడిన కాశ్మీర్ పండిట్స్ వ్యధలు ఇంకా పరిష్కరించ బడలేదు అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. కాశ్మీర్ పండితులను సురక్షితంగా వారి స్వస్థలాలకు పంపడమే అసలైన పరిష్కారం, ఆ దిశలో ప్రయత్నాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు, ఇటువంటి సమయంలో వచ్చిన ఈ చిత్రం ఈ దేశ ప్రజలను ఆ మార్గాన్ని సుగమం చేసేందుకు ఆలోచనలు కలిగించవచ్చును, భారత్ తిరిగి స్వాభిమానం గా తల ఎత్తు కోవాలంటే కశ్మీర్ కు మళ్లీ పూర్వ వైభవం రావాలి, ఆ దిశలో పడే ప్రతి అడుగు ఎంతో విలువైనది, అటువంటి విషయాలను ఆలోచించే దిశలో ఈ చిత్రం మనకు కనబడుతుంది. ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి సత్యాన్ని చెప్పాలంటే కూడా కొన్ని పరిమితులు ఉంటాయని ఈ చిత్రం చూసిన తర్వాత అర్థమవుతోంది. మొత్తానికి ఈ చిత్రం కశ్మీర్ వాస్తవ చరిత్రను మూడు దశాబ్దాల తర్వాత దేశ ప్రజల కళ్ళు తెరిపించే విధంగా ఒక చిన్న ప్రయత్నం అని చెప్పవచ్చును.
Courtesy :- NewsBharatiyam
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)