దేవాలయాల వద్ద కరోనా గైడ్ లైన్స్ ఆధారంగా దర్శన ఏర్పాట్లు చేస్తామనే ఆలోచన దేవాదాయ శాఖ ఎందుకు చేయడం లేదు?. వేలకోట్ల దేవుడి సొమ్ము జమచేసుకున్న దేవాదాయ శాఖ భక్తులకు కనీస జాగ్రత్త ఏర్పాట్లు చేసి దేవుని దర్శనం కలిగించలేదా ?.
ఇతర మతస్థుల పండుగలు, ప్రార్థనా స్థలాల వద్ద అమలు కాని నియమ నిబంధనలు దేవాలయాల వద్ద మాత్రమే ఎందుకు అత్యుత్సాహంగా అమలు చేస్తున్నారు ?.
అర్థరాత్రి వరకూ జనం గుమిగూడే వ్యాపార సంస్థలకు వర్తించని కరోనా రూల్స్ పరమ పవిత్రమైన దేవాలయాలకే వర్ధిస్తాయా ?.
VIP దర్శనాలతో రాని కరోనా సాధారణ భక్తులతో వస్తుందా ?. తిరుమల వెంకన్న స్వామి దర్శనాలు సామాన్యునికి దూరం చేస్తున్నారా ?.
ఆన్లైన్ బుకింగ్ పేరుతో భక్తులను నిరోధిస్తుంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదు ?.
రోగం అర్థం కానప్పుడు దేశంలో లాక్డౌన్ కంటే ముందే TTD దర్శనాలు నిలుపుదల చేస్తే హిందూ సమాజం ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ గడిచిన 2 సంవత్సరాలుగా VIP సహా సిఫార్సులకే స్వామి వారి దర్శనాన్ని పరిమితం చేస్తే స్వాగతించాలా ?. ఇది సామాన్యుడిని స్వామి వారికి దూరం చేయడం కాదా?.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సరైన భద్రతా చర్యలు చేపట్టి భక్తులకు అన్ని దేవాలయాలలో దర్శనం ఏర్పాట్లు కలిగించాలి, ప్రజల దార్శిక హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదు, నిజంగా కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తుందని ప్రభుత్వాలు భావిస్తే పూర్తిగా లాక్ డౌన్ పెట్టండి అన్నీ మూసివేయండి, ఎవరికీ అభ్యంతరం లేదు కానీ హిందూ పండుగలు వచ్చినప్పుడే మరియు దేవాలయాల వద్దనే కరోనా రూల్స్ అమలు చేసి కరోనాను నిర్మూలిస్తామనే ఆలోచనల నుండి బయటికి రండి, హిందూ పండుగలు అనేక కుల వృత్తులకు జీవనోపాధి కలిగిస్థాయి , ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాధి కుటుంబాలకు జీవనోపాధి కలిగిస్తాయి ఈ మాత్రం అవగాహనతో ఉండండి. హిందూ సమాజం తన ధార్మిక విశ్వాసాలపైన జరుగుతున్న దాడులను సమర్ధంగా తిప్పికొట్టాలి. మీడియా మిత్రులారా వాస్తవిక విషయాలతో చర్చించి హిందువుల ధార్మిక హక్కుల పట్ల గళం విప్పండి .
Courtesy :- Ravinutala Shashidhar