సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ల అరెస్టుపై మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నప్పుడు, ఇతరులను అవమానించినప్పుడు స్పందించరు కానీ…ఇతరులను మాత్రం అరెస్ట్ చేస్తారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు.
బీజేపీ సోషల్మీడియా సైట్లలో ఉండేవన్నీ ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారమేనని మండిపడ్డారు. మేం మాట్లాడితే మాత్రం టార్గెట్ చేస్తారా… జుబైర్ ను ఎందుకు అరెస్ట్ చేశారు.. ఆయనేం చేశారు. తీస్తాను ఎందుకు అరెస్ట్ చేస్తారు…ఆమె ఏం చేసింది. దీన్ని ఖండిస్తున్నాం అని ఆమె అన్నారు.
Alt News సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మహమ్మద్ జుబెయిర్ను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు ఒక రోజు రిమాండ్ విధించింది. మత పరమైన అల్లల్రు ప్రేరేపించేలా ఆయన రెచ్చగొట్టారని ఆయనపై కేసు నమోదైంది.
2002 గుజరాత్ అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలను సృష్టించారని ఆరోపిస్తూ నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్బీ శ్రీకుమార్లను అరెస్టు చేశారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయి.