ఈ దేశంలో చాలామంది భారతప్రధానిని ఇష్టపడుతారు. ఆయన్ని ఆరాధించేవాళ్లూ కోకోల్లలు. కారణం అయన నిరాడంబరమైన జీవనవిధానం కావడం. అట్టుడుగుస్థాయి నుంచి నిబద్ధతతో ఎదిగివచ్చిన వారు కనుక. తన పేరుకు ఎలాంటి ఇంటిపేరు జతచేయకుండా వ్యక్తిగతంగా ఆ స్థితికి చేరుకున్నారు. అయితే భారతదేశంలోని ఉదారవాదులు ఆయన్ని ద్వేషించడానికి అనేక కారణాలలో ఇది కూడా ఒకటి.
భారతదేశంలోని చాలా మంది ఉదారవాదులను గమనిస్తే వాళ్లల్లో చాలామంది ధనవంతులే అయి ఉంటారు. అందులోనూ జర్నలిస్టులు, కాలమిస్టులు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే వారి తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు రాజకీయ నాయకులుగా, మీడియా సంస్థల యజమానులుగా లేదా చాలా ధనవంతులుగా ఉండుంటారు కచ్చితంగా.
‘రచయిత’ అయిన స్వయంప్రకటితి మేధావి కూడా అయి ‘రూపా గులాబ్’ అనే పేరుతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ నడిపే వ్యక్తి…. ప్రధాని మోదీని డెన్మార్క్ రాణి మార్గరెత్ IIని కలిసినప్పుడు ఆ సందర్భాన్ని ఎగతాళి చేసింది. ఓ వీడియో షేర్ చేస్తూ… పీఎం మోదీ, డెన్మార్క్ రాణి ఒక టేబుల్పై కూర్చుని ఉన్నారు. వారి ముందు చక్కటి విందు ఉంది. భోజనం చేయటానికి అవసరమైన స్పూన్లు, ఫోర్క్ లు, చిన్నపాటి కత్తులు అక్కడ అమర్చి ఉన్నాయి. ఆ వీడియో జత చేస్తూ గులామ్ అన్న మాట… ‘ఏ ఫోర్క్ వాడాలో కూడా అతనికి తెలుసా?’ అని.
మోదీ ఏ దేశ పర్యటనకు వెళ్లినా స్థానిక మర్యాదలు చెప్పేందుకు ఓ బృందం ఉంటుంది. కానీ కావాలని మోదీని ఎగతాళి చేస్తూ ఉంటుంది ఆయా సందర్భాల్లో ఈఈ మేధావులు.
https://twitter.com/rupagulab/status/1521715611616694273?s=20&t=myP-0UdvX-B0fdIM9nupSg
మరో వీడియోలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని గమనిస్తే, దాదాపు 10 నిమిషాల 48 సెకన్ల దగ్గర రాహుల్ తన చేతులతో అన్నం, పప్పును కలిపి తన నోటిలో పెట్టుకోవడం మీరు చూడవచ్చు, అన్నం గింజలు అంతటా ఎగిరిపోతాయి. అతని పక్కన కూర్చున్న ఇద్దరు వ్యక్తులు తినే విధానంకూడా చూడవచ్చు. వారు ప్రతిరోజూ అలానే తింటారు కాబట్టి ముందుకు వంగి నోటిలో ఆహారాన్ని పెట్టుకోవాలని తెలుసు. అన్నం బట్టలపై పడకుండా చూసుకుంటారు. కానీ రాహుల్ కు ఆ అలవాటు ఉండి ఉండదు.. అలాంటప్పుడు “రాహుల్ గాంధీకి చేతులతో ఎలా తింటారో తెలుసా” అని ఎవరూ ప్రశ్నించలేదు.
బదులుగా, ఒక యువరాజు మారుమూల గ్రామంలోని సామాన్యులతో కలిసి భోజనం చేశారని ఆశ్చర్యపోతూ, మెచ్చుకుంటూ ట్వీట్లు చేస్తారు. కెమెరా అతనిపైనే ఫోకస్ చేస్తూ ఉంటుంది. ‘గాంధీ’ ఫ్యామిలీ ట్యాగ్ ఉన్నప్పటికీ, ఆ కుటుంబం నుంచి దేశానికి ముగ్గురు ప్రధానులుగా ఉన్నప్పటికీ.. ‘రాహుల్ బాబా’ ఎలా ఒదిగి ఉన్నాడో అంటూ చెప్తారు.
రైల్వే ప్లాట్ఫారమ్పై టీ అమ్మే సాధారణ నేపథ్యం నుంచి సామాన్య వ్యక్తిగా పార్టీలో తనకంటూ స్థాయిని పెంచుకున్న మోదీకి, ‘కట్లెరీ ఉపయోగించడం తెలియదని’ వెక్కిరిస్తారు, ఎగతాళి చేస్తారు కానీ అధికారం, డబ్బు ఉన్న రాహుల్ గాంధీ.. అతని తండ్రి, అమ్మమ్మ సహా ముత్తాత ప్రధానులు ఉన్నందున ఆటను ఏం చేసినా ఆకాశానికి ఎత్తేస్తారు. జర్నలిస్టులే ఇలా మోదీ మూలాలను ఎగతాళి చేస్తూ రాహుల్ గాంధీ సింప్లిసిటీని ప్రచారం చేస్తారు.
మోదీ చాలా మంది భారతీయులకు సాపేక్షంగా ఉంటారు, ఎందుకంటే ఆయన ‘మనలో ఒకడు’, ఆయన రోజు చివరిలో ఆనందంగా ఖిచ్డీ-కధీ-బతక ను షాక్-భాఖ్రీని భోజనంగా తింటాడు. భారతదేశంలో అసౌకర్యంగా ఉంటూ రహస్యంగా తెలియని విదేశీ ప్రదేశాలకు వెళ్లే వ్యక్తిలా కాదు. రైల్వే ప్లాట్ఫారమ్పై టీ అమ్మే వ్యక్తి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యారు.
అందుకే వారు ఆయన్ని ద్వేషిస్తారు.