1857లో జరిగిన సాయుధ పోరాటం భారత్ లోమళ్ళీ తలఎత్తకూడదు అనేది కాంగ్రేస్ వారి లక్ష్యం, అందుకే వాళ్లే వాళ్లతో యుద్ధం చేసే సైన్యాన్ని నాయకులను యుద్ధ వ్యూహాలను నిర్ణయించారు, వాళ్లు నిర్ణయించిన వ్యూహాలకు అనుగుణంగా నే ఉద్యమాలు సాగాయి అది కూడా వాళ్ళ కనుసన్నల్లోనే జరిగాయి. దానికోసం ఒక విస్తృతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి, అది కూడా ఆంగ్లంలో ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్లు కావాలి, అది ఈ దేశ ప్రజల మానసిక, నైతిక ,సామాజిక ,రాజకీయ విధానాలలో ఆ ప్రభావం కనపడాలి, ఆ ప్రభావంతోనే భారతదేశం వికసించాలి, అది ఆంగ్ల మానస పుత్రిక కావాలి అనేది వాళ్ల లక్ష్యం, దానికి అఖిలభారత దృష్టికోణం ఇవ్వబడింది, దానికి కావలసిన మానసికత నిర్మాణం చేశారు, ఆ మానసిక స్థితి నుండి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయిన ఇంకా పూర్తిగా బయటపడలేదు అని చెప్పటం అతిశయోక్తి కాదు. ఆ కాంగ్రేస్ 28.12. 1885 న ప్రారంభించబడింది వివరాల లోకి వెళ్తే……………
భారతదేశం యొక్క సామాజిక, రాజకీయ వైరుధ్యాల బీజాలు 1880 నుండి 1920 మధ్యకాలంలో బలంగా పడ్డాయి, దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ చేసిన పని, జాతీయ భావ చైతన్యం కంటే రాజకీయ అధికారం సాధనే అగ్రస్థానంలో ఉండటం. బ్రిటిష్ వారు ఈ దేశంలో ఎక్కువ కాలం పరిపాలనలో ఉండేందుకు చేసిన కుట్రలో భాగం కాంగ్రేస్,.ఆ భావజాలం నుండి దేశం ఈరోజుకి పూర్తిగా బయటపడలేకపోతున్నది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల సందర్భంలో ఆనాటి పరిణామాలకు సంబంధించిన కొన్ని మౌలిక విషయాలను అధ్యయనం చేయటం ఎంతో అవసరం ,ఆ అధ్యయనం ఈ దేశం యొక్క ఆమూలాగ్ర పరివర్తనకు దిశ దొరికే అవకాశం ఉంటుందేమో, ఈ దిశలో కొన్ని విషయాలను క్లుప్తంగా సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భారతదేశంలో అఖిలభారత దృష్టికోణం వేల సంవత్సరాలుగా సాంస్కృతిక,ఆధ్యాత్మిక, సామాజిక విషయాలు మాత్రమే ఉండేవి రాజ్య పాలన వ్యవస్థ దాదాపు ఒకే రకంగా ఉండేది, కానీ ఒకే ఛత్రం కింద పాలన దేశంలో అరుదుగా ఉంది, పాలన దృష్టిలో స్వతంత్రం కోసం స్వరాజ్యం కోసం సాగవలసిన ప్రయత్నాలు కూడా 1857 తర్వాత క్రమంగా వికసించటం ప్రారంభమైంది, దీనితో ఒకపక్క వైరుధ్యాలకు బీజం , మరోపక్క పాలనా వ్యవస్థ అఖిలభారత దృష్టికోణం రెండూ ఒకే సారి ప్రారంభమయ్యాయి అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. స్వాతంత్ర పోరాట సమయంలో చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన అంశాలను రేఖామాత్రంగా వివరించేందుకు ఇది ఒక చిన్న ప్రయత్నం
1857 స్వాతంత్ర పోరాటంఅనుభవాలు బ్రిటిష్ ఆందోళన
1857 సంవత్సరం జరిగిన స్వాతంత్ర సంగ్రామం విఫలమైంది బ్రిటిష్ వారి కుటిల నీతి తాత్కాలిక విజయాన్ని సాధించింది భారతీయుల హృదయాలలో రగిలిన అగ్నిజ్వాలలు ఉపశమించింది కానీ చల్లరాలేదు , బ్రిటిష్ వారి వాగ్దానాలు సంస్కరణలు భారతీయులను తృప్తి పరచలేక పోయింది అసంతృప్తి ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతూనే ఉంది. వాసుదేవ్ బలవంత ఫడ్కే నాయకత్వంలో మహారాష్ట్ర లోను రామ్ సింగ్ కూక నాయకత్వంలో పంజాబ్ లోను జరిగిన తిరుగుబాట్లు ఆంగ్లేయులను భయబ్రాంతులకు గురి చేసింది, గ్రామీణ ప్రాంతాల లోని దుర్భర దారిద్ర్యం దానికి తోడైంది, దేశవిదేశాలలోఉదృతమౌతున్న జాతీయ ఉద్యమం యువకులలో స్వాతంత్ర్య పీపసనుపెంపొందించినది. దేశంలో పెరుగుతున్న జాతీయ ఉద్యమం, ప్రజల్లో పెరుగుతున్న జాతీయతను విదేశీ పాలన పట్ల వారికున్న విముఖతను ఆంగ్లేయ అధికారులు పసిగట్టారు, 1857 నాటి విప్లవ వాసనలను వారు మరిచిపోలేకపోతున్నారు ప్రతి చిన్న సంఘటన భూతద్దంలో చూస్తున్నారు, 1907 మే 10 లోపు మరో పెద్ద విప్లవం వస్తుందేమోనని భయపడుతున్నారు అది ఏదో ఒక సమయంలో మహా విప్లవం గా మారగలదని అది వారి అస్తిత్వానికి ముప్పు కాగలదని భావించారు. దీంతో ఏదో ఒక రకంగా పరిస్థితులను చక్కదిద్దాలి అనే ఆలోచనలను చేస్తూ వచ్చారు. పెల్లుబుకుతున్న అసంతృప్తిని చెలరేగుతున్న ఉద్యమాన్ని నిరోధించటానికి ఆంగ్లేయులు ఒక రక్షణ కవచం అవసరం పడింది దాని కార్యాచరణే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.
అది ఎలా రూపు దిద్దుకొన్నది ?
ఆ కాంగ్రెస్ సంస్థ ప్రారంభానికి పూర్వం దేశంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి ఆ ప్రయత్నాలు కొన్ని కొనసాగాయి. 1865 లో లండన్ ఈస్ట్ ఇండియా సంఘం ఏర్పాటు చేశారు ఇది ఎక్కువ కాలం నిలబడలేదు 1866లో తూర్పు ఇండియా సంఘం దాదాభాయినౌరోజీ ప్రేరణతో ప్రారంభమైంది దీనిని ప్రముఖ పట్టణాలలో విస్తరించాలనే ప్రయత్నం జరిగింది కానీ అది అంతగా సఫలం కాలేక పోయింది. ఆ తదుపరి విశేష ప్రయత్నం చేసిన వాళ్లలో సురేంద్రనాథ్ బెనర్జీ ఒకరు మీరు దేశంలోని ప్రముఖ పట్టణాలు తిరిగి సమావేశాలు నిర్వహించి అఖిల భారత దృష్టికోణంలో ఆలోచించడానికి ఒక కేంద్ర సంఘం అవసరమని చెప్పారు 1883 ఇండియన్ అసోసియేషన్ పేరుతో ప్రారంభించారు, కాంగ్రెస్ పదం మొట్టమొదట సురేంద్రనాథ్ ప్రయోగించారు , త్వరలో ఒక జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు కానుందని కూడా ప్రకటించారు, 1883లో మొదటి సమావేశం జరిగింది రెండవ సమావేశం 1885లో జరిగింది ఈ విషయాన్ని ఆ రోజుల్లో హిందూ పత్రికలో ప్రముఖ వార్తగా వచ్చింది దాంతోపాటు కాంగ్రెస్ పుట్టుక గురించి కూడా రాసింది. కాంగ్రెసు ప్రారంభానికి సూత్ర ధారుడైన సర్ Hume కు సురేంద్రనాథ్ బెనర్జీ నాయకుడు కావడం ఇష్టం లేదు ఎందుకంటే ఆయన స్థాపించిన కాంగ్రెస్ ఎప్పుడో ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఏదిరించడంచేస్తుంది భారతదేశం లో బ్రిటిష్ ప్రభుత్వం శాశ్వతంగాఉండాలి దానికోసం 1885లోకాంగ్రెస్ ను ప్రారంభించి అఖిల భారత కాంగ్రెస్ ను బలహీనం చేయడం ప్రారంభం చేశారు , దాని ప్రధాన సూత్రధారి Hume ఈ సత్యాన్ని అంగీకరించరు వాళ్ల దృష్టిలో సురేంద్రనాథ్ బెనర్జీ ఒక అతివాది , ఈ ఆలోచనలను కాంగ్రెస్ నాయకులు ఎవరు వ్యతిరేకించలేదు కాంగ్రెస్ చరిత్ర వ్రాసిన పట్టాభి సీతారామయ్య రాసిన పుస్తకంలో’’ అసంతృప్తి జ్వాలలు కాదు విప్లవాగ్ని ఏ సమయంలోనైనా చెలరేగ వచ్చునని దేశమంతటి నుండి తేప్పించుకున్న ఏడు సంపుటాల నివేదికలు సర్ Hume కు అందింది , ఈ విపత్తు నుండి బయటపడటానికి రక్షణ కవచం గా కాంగ్రెసును నెలకొల్పడం తప్ప మరో మార్గం లేదని వాళ్ళు భావించారు’’ భారత్ లో ఇండియన్ కాంగ్రెస్ ఆంగ్లేయుల సృష్టి అనేది ఒక చారిత్రక సత్యం, కాంగ్రెస్ పుట్టుకకు LORDDUFFERINS మేధస్సు నుండి ఉద్భవించింది ఈ పని చేసేందుకు సర్ Allan Octavian Hume నియుక్తి చేయ బడ్డాడు. ఆ టాస్క్ స్వీకరించిన Hume ఆచరణలో పెట్టాడు. భారతదేశ విషయాలకు ప్రాతినిధ్యం వహించే గలిగే ఒక రాజకీయ వేదిక కావాలని అది కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వ్యవస్థ డిమాండ్ చేయాలి లేదా బ్రిటీష్ కాలనీ మార్గం లో సొంత ప్రభుత్వం కోసం పని చేయాలి. ఈ దిశలో జరిగిన ప్రయత్నాలు బ్రిటిష్ ప్రభుత్వానికి అది sefty వాల్వ్ కావాలి అనేది లక్యం. దానితో 1857లో జరిగిన సాయుధ పోరాటం భారత్ లోమళ్ళీ తలఎత్తకూడదు అనేది వారి లక్ష్యం, అందుకే వాళ్లే వాళ్లతో యుద్ధం చేసే సైన్యాన్ని నాయకులను యుద్ధ వ్యూహాలను నిర్ణయించారు, వాళ్లు నిర్ణయించిన వ్యూహాలకు అనుగుణంగా నే ఉద్యమాలు సాగాయి అది కూడా వాళ్ళ కనుసన్నల్లోనే జరిగాయి. దానికోసం ఒక విస్తృతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి, అది కూడా ఆంగ్లంలో ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్లు కావాలి, అది ఈ దేశ ప్రజల మానసిక, నైతిక ,సామాజిక ,రాజకీయ విధానాలలో ఆ ప్రభావం కనపడాలి, ఆ ప్రభావంతోనే భారతదేశం వికసించాలి, అది ఆంగ్ల మానస పుత్రిక కావాలి అనేది వాళ్ల లక్ష్యం, దానికి అఖిలభారత దృష్టికోణం ఇవ్వబడింది, దానికి కావలసిన మానసికత నిర్మాణం చేశారు, ఆ మానసిక స్థితి నుండి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయిన ఇంకా పూర్తిగా బయటపడలేదు అని చెప్పటం అతిశయోక్తి కాదు, ఒకవేళ భారతీయుడు స్వాతంత్రం కావాలంటే దేశాన్ని ముందుకు నడిపించేందుకు కొందరు నాయకులను కూడా ఎంపికచేసుకోవాలి లేక గుర్తించాలి అది కూడా తమకు అనుకూలంగా చేసుకోవాలి అని వాళ్లు నిశ్చయించుకున్నారు, ఆ తయారీకి కొందరిని ఉపయోగించుకోవాలనేది వారి వ్యూహం. దానికి తిలక్, దాదాభాయినౌరోజీ, డబ్ల్యూ సి బెనర్జీ, AJUDHIA NATH , JYABJI మొదలైన వాళ్లందరూ కాంగ్రెస్ లో పని చేయగలిగేట్లు చేసారు ఎందుకంటే వాళ్ళందరూ ప్రత్యేకంగా ఆలోచిస్తే తమకు ప్రమాదమని బ్రిటిష్ వాళ్ళుభావించారు.అదీ బ్రిటిష్ మంత్రాంగం. అట్లా ఒక ప్రక్క హిందువులకు కాంగ్రెస్ ఏర్పాటు చేసి, హిందువులకు పోటాపోటీగా ముస్లింలను నిలబెట్టారు, ఆ వివరాలుకూడా జాగ్రత్త గా గమనించాలి.
ఆంగ్లేయుల మంత్రాంగం ముస్లిం లలో చోటు చేసుకొన్న వేర్పాటు వాదం
అలీగడ్ ముస్లిం యూనివర్సిటీ స్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఒక సమయంలో జాతీయ సమైక్యతను ఆకాంక్షిస్తూ మాట్లాడుతూ భారతమాతకు రెండు కన్నులు హిందువులు ముస్లిములు అని అభివర్ణించాడు 1884 ఫిబ్రవరి మూడో తేదీ నాడు ఆ సయ్యద్ మాట్లాడుతూ జాతి అంటే హిందువులు ముస్లింలు కలిసి అని నా అర్థం, మనమందరం ఒకే దేశం ప్రజలము ఒకే పాలన వలన నష్టపోతున్నాం, దరిద్ర దేవత కారణంగా ఒకే రకమైన బాధలు అనుభవిస్తున్నాము అని చెప్పారు. , భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొని అతి ముఖ్యమైన వర్గం ముస్లింలు దానికి రెండు కారణాలు1) ఆ రోజుల్లో దేశ జనాభాలో వాళ్లు 25% ఉన్నారు 2) ఏడు వందల సంవత్సరాలు మేము ఈ దేశం యొక్క పాల కులం అనే భావన ఉండేది ఈ విషయాన్ని వివరిస్తూ విల్ ఫ్రెడ్ కౌంట్ వెల్ స్మిత్ ” ముస్లిం వ్యవహారము హిందువులను వారి మతాన్ని అణిచి వారిపై పెత్తనం చేయటానికి జరిపిన దురాక్రమణ అని చెప్పాడు. దానిని భారత్ అంగీకరించదు, ఆ స్వభావమే రెండు మతాల మధ్య శాశ్వత శతృత్వం సృష్టించింది. ఆంగ్లేయులు దీనిని తెలివిగా ఉపయోగించుకుని కాంగ్రెస్ ఏర్పాటుచేసినట్లే ముస్లింలకు 1906లో ముస్లింలీగ్ ఏర్పాటు చేసింది. ఇస్లాం మతం పై ఎటువంటి హిందూమత ఛాయలు పడకుండా చేయగలిగారు. 18వ శతాబ్దంలో భారత జాతీయ కాంగ్రెస్ లో ముస్లిం చేర వద్దని స్పష్టం చేసిన వాడు సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈయనే ఆ తదుపరి కాలంలో అలీగడ్ ముస్లిం యూనివర్సిటీ కూడా స్థాపించాడు అహ్మద్ ఖాన్ ముస్లిములకు అలీగడ్ ముస్లిం యూనివర్సిటీ స్థాపించడానికి 1)బెనే 2) మారిసన్, వారిరువురు ఆ కళాశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పని చేసారు. ద్విజాతి సిద్ధాంతాన్నీ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకునూరిపోయటం ప్రారంభించారు,అట్లా హిందువుల నుండి ముస్లిములను వేరు చేశారు
ఆ సమయంలోద్విజాతి సిద్ధాంతానికి భిన్నంగా జాతీయ ముస్లిములుమాట్లాడటం ప్రారంభించారు జాతీయత ,మతానికి సంబంధం లేదు, కాంగ్రెస్ జాతీయ పార్టీ కాంగ్రెసులో చేరి స్వతంత్రం కోసం ముస్లిములు కూడా పనిచేయాలని గట్టిగా చెప్పేవారు వారిలో ప్రముఖులు badar uddinత్యాబ్జి .
కాంగ్రెస్ లో చోటు చేసుకొన్నా బ్రిటిష్ వ్యూహాలు ఇప్పటికి కొనసాగుతున్నాయా?
కాంగ్రెస్ వాళ్ళు అతివాదులు, మితవాదులు అనే రెండు వర్గాలుగా చీలిపోయారు, అతివాదులు చెప్పే విషయాలు మూడు లక్షణాలు ప్రధానంగా ఉన్నాయి 1)భారతీయం, భారతదేశానికి ఒక గొప్ప సంస్కృతి ఉంది దానిని భారతీయ సంస్కృతి అంటారు 2) జాతీయతకు ఆధ్యాత్మిక తత్వం అర్థం చెప్పేవారు, జాతీయ కు ఆధారం మాతృభూమి భావన దానినే భారతమాత అని వ్యాఖ్యానించారు , స్వరాజ్యం అనే పదాలు మన వేదాలు లోనే ఉన్నాయని స్పష్టంగా చెప్తూ ఉండేవారు అట్లా చెప్పేవారిలో ప్రముఖులు అరవింద ఘోష్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలాలజపతిరాయ్ . 3) ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలి స్వరాజ్యం మా జన్మ హక్కు అది ఒకరు ఇస్తే తీసుకునేది కాదు సాధించుకొనేది. స్వరాజ్యమే లక్ష్యంగా భారతీయులు పనిచేయాలని చెప్పేవారు. సూరత్ మహా సభలలో మితవాదులు ఒక క్రొత్త పల్లవి ఎత్తుకున్నారు ,మాకు కావలసినది స్వపరిపాలన అంతే కానీ స్వరాజ్యం కాదు అన్నారు ఆ విధంగా మితవాదులు బ్రిటిష్ వారి పట్ల తమ విధేయత ప్రకటించుకొన్నారు. తిలక్ ,అరవింద్ మొదలైనవారు కాంగ్రెస్ నుండి దూరం జరిగారు సూరత్ మహా సభల తర్వాత కాంగ్రెస్ లోని మిత వాదులు కాని వారి పట్ల బ్రిటిష్ ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబించింది, బాలగంగాధర్ తిలక్ ను నిర్బంధించి ఆరు సంవత్సరాలు మాండలే జైలుకు పంపింది, 1909 చివరిలో పంజాబులో ప్రజల మన్ననలు పొందిన భాయి పరమానందం ను ద్వేషించటం మొదలుపెట్టింది, లాలాలజపతిరాయ్ అస్వస్తులుగా ఉన్న సమయంలో కాకినాడలో కాంగ్రెస్ సభలు జరిగాయి, ఆ సమయం హిందూ ముస్లిం సక్యతకు ప్రయత్నం జరుగుతున్నసమయం ఆ సమావేశాలకు అధ్యక్షులు మహమూద్ ఆలీ వందేమాతరం గీతానికి కి అభ్యంతరం చెప్పిన వ్యక్తి ఆ సమయంలో అధ్యక్ష ఉపన్యాసం లో బెంగాల్ విభజన రద్దు కావటం వలన ముస్లిములకు నష్టం వాటిల్లిందని అన్నారు దేశాన్ని హిందూ ముస్లిములు భాగాలుగా నిర్దేశించి అందులో అస్పృశ్యులకు మతం మార్పిడి అవకాశం కల్పించాలని కోరాడు, హిందువులు అస్పృశ్యలను తమలో కలుపుకో లేనప్పుడు వారు ఇస్లాం మతం స్వీకరించి టానికి అభ్యంతరం పెట్టకూడదని స్పష్టం చేశారు.ఆ రకంగా హిందూసమాజంలో చీలికలు తెచ్చే ప్రయత్నాలు అప్పటినుండి ప్రారంభమైనాయని చెప్పవచ్చు. అట్లాగే దేశంలో పౌరుష పరాక్రమాలు నిరంతర దాడులు ఎదుర్కొన్న ప్రాంతాలలో పేర్కొనదగినది పంజాబ్ ఆ పంజాబ్ బ్రిటిష్ వాళ్ళు తమకు అనుకూలంగా మలుచుకోవడం 1857 స్వాతంత్ర్య పంజాబ్ అంత ప్రముఖ పాత్రను పోషించి లేకపోయింది మేము ఈ దేశంలో ఒక ప్రత్యేక అనే ఆలోచనలు కూడా వాళ్లలో పడ్డాయని అనిపిస్తుంది అది ఈరోజు కూడా లీలా మాత్రంగా వ్యక్తమవుతుంది భాషా ప్రయుక్త రాష్ట్రాలకు బీజం పడింది బ్రిటిష్ ఆలోచనలుక్రమంగా ఈ దేశ బలంగా నాటుకొన్నాయి. అవి ఈ రోజుకి కొనసాగుతున్నాయి. ముస్లింలు దళితులను కలుపుకొని దేశంలో మరింత శక్తివంతం కావటానికి సంబంధించిన ప్రయత్నాలు ఆ సమయంలోనే ప్రారంభమయ్యాయి.గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత కు కు కు తిరిగి వచ్చారు. గాంధీజీ రంగ ప్రవేశం తర్వాత పోరాట స్ఫూర్తి తెర వెనుక కు మళ్లీ పోయింది సత్యము అహింస ద్వారానే స్వాతంత్రం రావాలి సత్యం అహింసే స్వాతంత్ర పోరాటానికి ఆయుధాలు కావాలి అని ప్రభోదించటం మొదలుపెట్టారు ఎందుకంటే ఈ దేశ ప్రజల స్వభావంలో ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి దీనిని ఉపయోగించుకొని తెలివిగా ఉద్యమం ఆంగ్లేయులు ఉన్నంతకాలం సురక్షితంగానే ఉండాలి అనేది వ్యూహం అట్లాగే ఉండగలిగారు. అంతర్జాతీయ పరిణామాలు సైన్యంలో పెరుగుతున్న వ్యతిరేకతలు ఇవన్నీ కలగలిసి భారత్ కు తన పాలనా వ్యవస్థను అప్పగించి ఆంగ్లేయులు ఈ దేశం నుండి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ స్వతంత్రం సంపాదించిందా? బ్రిటిష్ వాళ్ళ నుండి అధికారం అందిపుచ్చుకున్న దా అనేది ఇది ఒక పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకు మనం సమాధానం వెతకాలి ,అట్లాగే స్వతంత్ర పోరాటం లో తెరవెనుకకు వెళ్ళిపోయినా జాతీయ చైతన్య ము, స్వరాజ్య స్ఫూర్తి కొనసాగించటానికి 1925 నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అందిపుచ్చుకొని పనిచేయటం ప్రారంభించింది. దానిని కొనసాగించటం లో కాంగ్రెస్ నుండి అనేక సవాళ్ళను ఎదుర్కొంది. ఈ రోజు దేశంలో కనబడుతున్న జాతీయ చైతన్య ము జాగృతం చేయటానికి సంఘం పని చేసిన తీరును అధ్యయనం చేయాలి. ఎప్పటికి కాంగ్రేస్ తీరు ఏమి మారలేదు ఆ వివరాలు స్వాతంత్య్రానంతరం దేశం లో జరిగిన జరుగుతున్నా పరిణామాలను తెలుసుకోవాలి.
Courtesy :- Swarajyam75