భారతదేశానికి చెందిన ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) వర్కర్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మే 22న గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డ్-2022తో సత్కరించింది. “ప్రపంచ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడం, నాయకత్వ ప్రదర్శన, ప్రాంతీయ ఆరోగ్య సమస్యల పట్ల నిబద్ధత” పై కొనసాగుతున్న 75వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో వారికి అవార్డును ప్రధానం చేశారు. ప్రకటన ప్రకారం బహుమతి గ్రహీతలను WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ నిర్ణయించారు.
ఆశా వర్కర్ల బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. “ఆశా వర్కర్ల మొత్తం బృందానికి WHO డైరక్టర్ జనరల్ గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డు లభించినందుకు ఆనందంగా ఉంది. ఆశా వర్కర్లందరికీ అభినందనలు. ఆరోగ్యవంతమైన భారతదేశానికి భరోసా ఇవ్వడంలో వారు ముందంజలో ఉన్నారు. వారి అంకితభావం, సంకల్పం ప్రశంసనీయం” అని మోదీ ట్వీట్ చేశారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా కూడా ఆశా వర్కర్లను అభినందించారు, భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ అందించడంలో వారు ముందంజలో ఉన్నారని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆశా వర్కర్లకు తన అభినందనలు తెలియజేసారు, ఈ అవార్డు ‘గర్వించదగినదని’ పేర్కొన్నారు.