పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ గడ్డమీద బిజెపి మెరుగైన ఫలితాలు సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వస్తాయి అని భావించినప్పటికీ,, ఎనిమిది సీట్లకే పరిమితం కావలసి వచ్చింది. కానీ లోక్ సభ ఎన్నికల సమయానికి గట్టిగా పుంజు కుంది. మొత్తం 17 నియోజకవర్గాలకు కానీ సగం సీట్లు అంటే ఎనిమిది చోట్ల గెలుపు సాధించింది. మిగిలిన చోట్ల కూడా రెండవ స్థానం దక్కించుకుంది.
ఈ ఫలితాలు సాధించడంలో కీలకంగా నిలిచిన పార్టీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డికి ప్రమోషన్ ఇచ్చి క్యాబినెట్ మంత్రి పదవి ఇచ్చారు అటు మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ శ్రమను గుర్తిస్తూ మొట్టమొదటిసారి క్యాబినెట్ లోకి తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది,, మంత్రి పదవులు ఆశించిన ఈటల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి నేతలకు నిరాశ ఎదురైంది. ఈ నాయకుల్లో ఒకరికి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది.
రాబోయే కాలంలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి అందుచేత పార్టీని బలంగా ప్రజలకు తీసుకెళ్తే ఎక్కువ సంఖ్యలో స్థానిక సంస్థల పదవులు దక్కించుకోవచ్చు పార్టీని పటిష్టం చేయడంలో గ్రామస్థాయిలో సర్పంచ్ మండల అధ్యక్షుడు వంటి పదవులు చాలా ముఖ్యం. దీనిని దృష్టిలో పెట్టుకుని ఫుల్ టైం పనిచేసే నాయకుడికి పార్టీ అధ్యక్ష పదవి కేటాయిస్తారని తెలుస్తోంది.
తెలంగాణలో బిజెపి అధ్యక్ష పదవి కోసం పోటీ గట్టిగానే ఉంది. పార్టీ నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని,, తర్వాత అయిదేళ్ళ లో ప్రభుత్వం ఏర్పాటుకు బిజేపి కసరత్తు మెదలు పెట్టింది. ఇందుకు బలమైన అధ్యక్షుడిని నియమించాలని మోడి, అమిత్ షాలు తలపోస్తున్నారు. తెలంగాణలో బలమైన సామాజికవర్గం, తెగింపు ధైర్యం ఉత్సాహం నిండిన వ్యక్తులకోసం అరాతీస్తున్నారు. ముఖ్యంగా
కమలం బాస్ రేస్ లో ఈటల రాజెందర్ , డికే అరుణ , భానుప్రకాష్ , రాంచందర్ , రఘునందన్ రావుల పేర్లు వినబడుతున్నాయి .
తెలంగాణ ఉద్యమానికి స్పూర్తి అయిన ఉమ్మడి మెదక్ జిల్లాలో కేసిఅర్, హరిష్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలనుంచి భారీ ఓట్లతో రఘునందన్ రావు మెదక్ ఎంపిగా గెలిచారు . మంచి వాగ్ధాటి , బలమైన క్యాడర్ వుండి వృత్తి రీత్యా న్యాయవాది అయిన రఘునందన్ రావుకు యువకుల్లో మంచి క్రేజ్ వుంది.
కాని కేవలం ఒక్క శాతం వున్న వెలమలకు పదవి అప్పగిస్తే పార్టీకి ఎలాంటి ప్రయోజనం వుంటుందన్నది ప్రశ్న.
బ్రాహ్మణ సామాజికర్గానికి చెందిన రాంచందర్ రావు మొదటినుంచి పార్టీలో వున్నారు.. ఢిల్లీస్తాయిలో మంచి సంబందాలు వున్నాయి.అయితే ఈయనకు క్యాడర్, డబ్బు లేకపోవడం మైనస్ గా నిలుస్తోంది.
మరో వైపు సిఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి మెజారిటీ తో గెలచిన డికే అరుణ కు రాజకీయంగా మంచి అనుభవం వుంది. ప్రస్తుతం బిజేపి జాతీయ ఉపాద్యక్షురాలిగా వున్నారు. అరుణకు మోడి అమిత్ షాల ఆశీస్సులు ఉన్నాయి . బలమైన రెడ్డి సామాజిక వర్గం తో పాటు .. సిఎం రేవంత్ రెడ్డితో దైర్యంగా పోరాడే సత్తా ..ఆమెకు కలిసి వచ్చే అంశాలు .
మరో వైపు బిజేయైఎం మాజీ అధ్యక్షుడైన భానుప్రకాష్ పేరుకూడా అధ్యక్షుడిగా వినబడుతోంది
బిఅర్ ఎస్ ప్రభుత్వం పరిపాలన లో భాను ప్రకాశ్ అనేక పోరాటాలు చేసారు. పోలీసు లాఠీ దెబ్బలు తిన్నారు. పేపర్ లీకేజ్ పై పోరాటంచేసారు.
తెలంగాణలో ముదిరాజ్ సామాజికవర్గం 16 శాతం వుంది. ఈ సామాజిక వర్గానకి చెందిన భాను.. ఏబివిపి నుంచి ఎదుగుతు వచ్చాడు. దీన్ని దృష్టిలో పెట్టుకోని
భానుప్రకాశ్ పేరునుకూడా అధినాయకత్వం పరిశీలిస్తుంది
ఈ నాయకులు అందరికంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఈటల రాజేందర్.
అన్ని కుదిరితే ఈ పాటికి ఈటల రాజేందర్ పార్టి అధ్యక్ష సీట్లో కూర్చోవలసి వుండేది. కాని ఎం అయ్యిందో ఏమో కాని ఈటల నియామకం ఆలస్యం అవుతూ వస్తోంది . ఈటలకు పోటిలో వున్న బండిసంజయ్ , కిషన్ రెడ్డిలకు కేంద్రమంత్రిపదవులు రావడంతో ఈటల అద్యక్షపదవికి లైన్ క్లియర్ అయ్యింది . ముదిరాజ్ వర్గానికి చెందిన ఈటల తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రపోషించారు. ఫలితంగా తెలంగాణలో అయనకు మంచి ఇమేజ్ వుంది .
ఈటల రాజేందర్ నియామకం 99శాతం అయినట్లే అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ,, లెఫ్ట్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ఈటల … హిందుసిద్దాంతాలను నమ్ముతారా అన్న అనుమానాలు హైకమాండ్ లో వున్నాయి. ఇప్పటి వరకు అయన .. ఏనాడూ జైశ్రీరాం అన్న నినాదంచేయలేదని, హిందు సిద్ధాంతం పై నమ్మకం లేదని ఆరోపణలు వున్నాయి.
రాజెందర్ ముదిరాజ్ బిసి సామాజిక వర్గానికి చెందినప్పటికి అయనను ముదిరాజ్ లు తమవారిగా గుర్తించడంలేదు. భార్య రెడ్డి కావడంతో అయన కొడుకు, కూతురి పేర్ల చివర రెడ్డి అని వుంది. ఈటల కు కూడా రెడ్డిస్ సామాజిక వర్గాలతోనే అలయ్ భలయ్ వుంది .
చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు బలమైన ఆర్థిక నేపథ్యంలో పారిశ్రామికవేత్తలతో అనుబంధాలు కలిసి వస్తున్నాయి.
మరి పార్టీ హైకమాండ్ ఎవరిని కరుణిస్తుందో,, ఎవరికి అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తుందో వేచి చూడాలి.