2014 తరువాత విద్యుత్ రంగంపై మోడీ పెట్టిన శ్రద్ధ, తీసుకున్న చర్యలు వల్ల విద్యుత్ రంగంలో
ఏ విధంగా మంచి మార్పులు సంభవించాయో చూద్దాం. ఈ కాలంలో విద్యుత్ సమస్య అధిగమించడానికి రాష్ట్రాలు చేపట్టిన చర్యలు ఏమిటో ఎవరైనా తెలియ చేస్తారా?
రాష్ట్రాలు ఏవీ దీర్ఘకాలిక ప్రణాళికలు లేకుండా ఉచిత విద్యుత్ స్కీములు ప్రకటిస్తూ ఉంటే సమస్య ఎలా పరిష్కారం అవుతుంది?
2014 లో మోదీ అధికారంలోకి వచ్చాక వెంటనే బాగా శ్రద్ధ పెట్టిన రంగం విద్యుత్ రంగం. ఎందుకంటే పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 13 సం.లు అనుభవంతో రాష్ట్ర అభివృద్ధికి విద్యుత్ ఎంత అవసరమో గుర్తించారు. ఎందుకంటే విద్యుత్ కొరత వల్ల పారిశ్రామిక రంగం ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. డీజిల్ జనరేటర్ లతో చేసిన ఉత్పత్తి కానీ అందించే సేవలు కానీ ఖరీదు పెరిగిపోతాయి. 2001లో ఆయన ముఖ్యమంత్రి అయ్యేసరికి గుజరాత్ లో ఎలక్ట్రిసిటీ పరిస్థితి అతి దారుణంగా ఉండేది.. విపరీతమైన పవర్ కట్స్ ఉండేవి. వ్యవసాయ లైన్లు, గృహ అవసరాలకు వాడుకునే లైన్లు వేరు చేసి వ్యవసాయానికి తక్కువ రేట్ కి ఇస్తున్న విద్యుత్ మిగతా అవసరాలకు వాడుకోకుండా చర్యలు తీసుకున్నారు. ఓట్లు పోతాయేమో అని భయపడకుండా విద్యుత్ చార్జీలు పెంచారు. 4 సం.లలో నష్టాల్లో ఉన్న ఎలక్ట్రిసిటీ బోర్డ్ ని లాభల్లోకి తీసుకొచ్చారు. విద్యుత్ కొరత ఉన్న రాష్ట్రం నుంచి విద్యుత్ పక్క రాష్ట్రాలకు ఇవ్వగలిగే స్థితికి తీసుకు వచ్చారు. ఒక సమస్య గుర్తించడం, పరిష్కార మార్గాలు కనుక్కోవడం, ఒక పద్ధతి, టైమ్ ఫ్రేమ్ లో ఆ సమస్యని పరిష్కరించడం ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు. అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అవసరం అయితే ప్రజలకు నచ్చని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోగలం తెగువ ఉండాలి. సరిగ్గా ఇవే అతనిలో ఉన్నాయి. ఒకసారి రాష్ట్ర ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు పెంచితే బీజేపీ హై కమాండ్ కూడా ధరలు పెంచడానికి ఒప్పుకోలేదు. కావాలంటే ఎన్నికలు అయ్యాక పెంచుకోమంది. నాణ్యమైన విద్యుత్తు 24/7 గంటలూ ఇస్తా అని ప్రజలకు నేను నచ్చచెప్పుకుంటాను. ఎన్నికలలో గెలుస్తాను అని మరీ చెప్పి ధరలు పెంచి కూడా ఎన్నికలలో గెలిచిన నాయకుడు. అదే అనుభవం తో కేంద్రంలో అధికారంలోకి రాగానే విద్యుత్ సమస్యపై దృస్థి సారించారు.
విద్యుత్ రంగంలో మూడు ముఖ్యమైన విభాగాలు ఉంటాయి. అవి ఉత్పత్తి, ప్రసరణ, పంపిణీ (ప్రొడక్షన్, ట్రాన్స్మిషన్, డీస్ట్రిబ్యూషన్)
విద్యుత్ మనదేశంలో ఉత్పత్తి జరిగినా ప్రసరణ, పంపిణీ విభాగాలు సరిగా లేకపోవడం వల్ల 2014 ముందు ప్రజలు అవసరమైన దానికంటే ఎక్కువ విద్యుత్ కోతలు అనుభవించేవారు. 2012లో మన దేశంలో వచ్చిన బ్లాక్ ఔట్ ఒకే సారి 60 కోట్ల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం అన్నది ఈ లోటుపాట్ల వల్లే. ఈ బ్లాక్ ఔట్ ఇప్పటికి అది ఒక ప్రపంచ రికార్డ్.
అందుకే మోదీ ప్రభుత్వం మూడు విభాగలపై ఒకేసారి దృష్టి సారించింది. దాని పరిణామాలు ఈ 6 సం. లుగా ఇలా ఉన్నాయి.
విద్యుత్ ఉత్పత్తి :
2014 మార్చ్ కి 2,48,554 mw
2020 జులై కి 3,71,977 mw
అంటే ఒక్క 6 సం.లలో ఉత్పత్తి 50% పెరిగింది.
పై పెరుగుదలలో –
పునరుత్పాదక(renewable) 34,998mw నుండి 88,042 mw అంటే 151% పెరిగింది.
విద్యుత్ ప్రసారణ లైన్స్ :
(C-km అంటే సర్క్యూట్ కిలో మీటర్)
2014 మార్చ్ కి 2,91,336 C-km
2019 మార్చ్ కి 4,13,407 C-km
అంటే ఒక్క 5 సం. లలో42% పెరిగింది. గతంలో ఇదే సుమారు ఒక లక్ష C-km వేయడానికి 12 సం. లు తీసుకున్నారు.
విద్యుత్ ప్రసార సామర్ధ్యం :
2014 మార్చ్ కి 5,30,546 mva
2020 మార్చ్ కి 9,67,893 mva
అంటే 6 సం. లలో సుమారు 82%పెరుగుదల.
ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ విషయంలో ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే ఈ లైన్స్ లో ఎక్కువ భాగం ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ సహా మారుమూల పల్లెలు దాకా అంటే ఎక్కువ కొండ ప్రాంతాల్లో వేశారు. గత ప్రభుత్వాలు కొండ ప్రాంతాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. పై చర్యల వల్ల మోదీ ప్రభుత్వం వచ్చిన మొదటి రెండు సం.ల నుంచే విద్యుత్ కోతలు చాలా తక్కువ చూస్తున్నాం. ఈ క్రింద ఫోటోలు 2014-19 మధ్య తేడా చూపిస్తే, NASA విడుదల చేసిన ఫోటోలు చూస్తే 2012 కి దేశంలో విద్యుత్ పరిస్థితి 2019 కి పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, దేశం మధ్య భాగంలో తేడా గమనించాలి.
~ చాడా శాస్త్రి