CIA చాలా కాలంగా వెతుకుతున్న అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి గురుంచి ఇంటెలిజెన్స్ సమాచారం ఎవరు ఇచ్చారు ? వెల్ ! హాక్కాని నెట్ వర్క్ సిఐఏ కి సమాచారం ఇచ్చింది. పాకిస్థాన్ లోని అట్టోబబాద్ లోని మిలటరీ కంటోన్మెంట్ ఏరియా కి దగ్గరలోనే ఒక భవంతి లో ఒసామా ఉన్నట్లుగా తెలుసుకొని అమెరికన్ సిఐఏ తెలుసుకోవడానికి 11 ఏళ్ల పట్టింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ISI సహాయ సహకారాలతోనే ఒసామా అమెరికాకి చిక్కకుండా అన్ని సంవత్సరాలు ఉండగలిగాడు. నావీ సీల్స్ ఒసామా ని మట్టుపెట్టాక అల్ జవహిరి గురుంచి వేట మొదలుపెట్టింది కానీ రెండు రోజుల క్రితం వరకు సిఐఏ అల్ జవహిరి జాడ కనుక్కోలేక పోయింది అంటే పాక్ ISI ఎంత పటిష్టంగా తీవ్రవాదులకి రక్షణ కల్పిస్తున్నదో అర్ధమవతున్నది.
చాల కాలంగా అల్ జవహరి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్థాన్ సరిహద్దుల దగ్గర ఉన్న గిరిజన ప్రాంతాలలో ఉన్నాడని వచ్చిన ఇంటిలిజెన్స్ సమాచారం తప్పని సిఐఏ చాలా ఆలస్యంగా తెలుకుంది. నిజానికి అల్ జవహరి పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ లలో ఉంటూ వచ్చాడు తరుచూ అటూ ఇటూ మారుతూ కానీ సిఐఏ పసిగట్టలేకపోయింది. దీని వెనుక హాక్కానీ నెట్ వర్క్ , ISI లు ఉన్నాయి.
అమెరికా – పాకిస్థాన్ ల మధ్య రహస్య ఒప్పందం ?
అల్ జవహరి ఆచూకీ తెలిపితే వచ్చే అక్టోబర్ లో జరిగే FATF సమావేశంలో పాకిస్థాన్ ని గ్రే లిస్ట్ నుంచి తొలిగించడానికి సహకరిస్తానని మాట ఇచ్చింది అమెరికా. దాంతో అల్ జవహరిని పాకిస్థాన్ నుంచి కాబూల్ తరలించింది హక్కాని నెట్ వర్క్, అదీ రహస్యంగా ! జూన్ నెలలోనే అల్ జవహరి కుటుంబ సభ్యుల తరలించిన హక్కాని నెట్వర్క్ వారం రోజుల క్రితం అల్ జవహరిని కూడా రహస్యంగా కాబూల్ కి తరలించి సిఐఏకి సమాచారం ఇచ్చింది. నిజానికి MQ రీపర్ డ్రోన్లని పాకిస్థాన్ నుంచే ఆపరేట్ చేస్తున్నట్లు తెలిసింది. గత సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో దళాలు వెనక్కి వెళ్ళిన తరువాత ఖతార్ లోని దోహాలో అతి పెద్ద డ్రోన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని నిర్వహిస్తున్నది అమెరికా. దోహా నుంచే ఆఫ్ఘనిస్తాన్ తో పాటు పాకిస్థాన్ సరిహద్దుల వరకు నిఘా పెడుతూ వచ్చింది.
అల్ జవహరిని పాకిస్థాన్ నుంచి కాబూల్ కి తరలించడంలో హక్కాని నెట్ వర్క్ పాత్ర చాలా ముఖ్యమయినది. ఆఫ్ఘనిస్తాన్ లో అంతర్గత భద్రత ని నిర్వహిస్తున్నది హాక్కానీ నెట్వర్క్ అందుకే అన్ని చెక్ పోస్ట్ లు కూడా హాక్కానీ నెట్వర్క్ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి అల్ జవహరిని కాబూల్ కి తరలించడం ఆ విషయం తాలిబన్ల కి తెలియకుండా ఉండడం జరిగింది. ఇక అల్ జవహరి ఉంటున్న కాబూల్ లోని ఇంటి GPS కో ఆర్డినేషన్ ని నేరుగా సిఐఏ కి అందించింది ఐఎస్ఐ. దాంతో అల్ జవహరిని చంపడం చాలా తేలికగా జరిగిపోయింది. కానీ ఈ విషయం తాలిబన్ల కి తెలియదు. అసలు అల్ జవహరి కాబూల్ లో ఉంటున్నట్లు తమకి తెలియదని తాలిబన్లు అంటున్నారు అంటే ఈ మొత్తం ఆపరేషన్ ని ఎంత పకడ్బందీగా నిర్వహించిందో ఐఎస్ఐ అర్ధం అయిపోతున్నది.
పాకిస్థాన్ ప్రమాదంలో పడిందా ?
అల్ జవహరిని పాకిస్థాన్ లో ఉన్నప్పుడే సమాచారం ఇచ్చి చంపవచ్చు ఐఎస్ఐ కానీ అక్కడ జరిగితే మిగతా ఉగ్ర గ్రూపులు తిరుగుబాటు చేస్తాయి పాక్ సైన్యం మీద.. దాంతో కాబూల్ తరలించి ఆ నెపం తాలిబన్ల మీద నెట్టి వేసింది పాకిస్థాన్. కానీ రహస్యం దాగదు. ఐఎస్ఐ సహకారంతో హాక్కానీ ఈ పని చేసింది అని తెలుసుకోవడానికి అల్ ఖైదా కి పెద్దగా సమయం అక్కరలేదు. త్వరలో పాకిస్థాన్ లో భారీగా విధ్వంసం జరగవచ్చు.
చేతిలో డాలర్ రిజర్వ్ లు లేనందు వల్ల తమతో స్నేహంగా ఉండే దేశాలకి పాకిస్థాన్లోని వివిధ సంస్థలని తాకట్టు పెట్టి డాలర్లు అప్పుగా తీసుకోవాలనే ప్రతిపాదన నెల క్రితమే పాక్ ప్రభుత్వం ముందుకు తెచ్చింది కానీ ఈ లోపు అల్ జవహరి ఉదంతం తెర మీదకి వచ్చి కొంచెం ఊరటనిచ్చింది. అసలు FATF గ్రే లిస్ట్ నుంచి పాకిస్థాన్ ని తొలగించకుండానే ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ పాకేజీ కోసం పాక్ ప్రభుత్వంతో ఎలా సంప్రదింపులు చేస్తుంది ? అంటే ముందు నుంచి అంతా ప్రీ ప్లాన్డ్ గా జరుగుతున్నది అన్నమాట !
అంతా ప్రీ ప్లాన్డ్ గా జరుగుతున్నది అని చెప్పే మరో పెద్ద ఉదాహరణ డాలతో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి ఏకంగా 10 రూపాయలు బలపడడం ఆశ్చర్యం కలిగిస్తున్నది అదీ అల్ జవహరి ని మట్టుపెట్టిన రెండవరోజే ఇది జరగడం యాదృచ్చికం కానే కాదు. ఒక రూపాయి లేదా రెండు రూపాయలు బలం పుంజుకోవడం జరుగుతుంది ఎక్కడయినా కానీ ఒకే రోజులో 10 రూపాయలు బలపడడం ఎలా సాధ్యపడింది ? హఠాత్తుగా పాకిస్థాన్ నుంచి ఎగుమతులు పెరిగాయా ? లేదే ! పోనీ పాకిస్థాన్ స్టేట్ బ్యాంకు బహిరంగ మార్కెట్లో డాలర్లు అమ్మకానికి పెట్టిందా ? లేదు. మరి ఒక్క రోజులో డాలర్ తో పాకిస్థాన్ 10 రూపాయలు ఎలా బలపడింది ?
ఆగస్ట్ 2 వ తేదీన ఒక డాలర్ కి 238 పాకిస్థాన్ రూపాయలుగా ఉండగా అది ఆగస్ట్ 3 వ తీదీన అంటే నిన్న ఏకంగా పది రూపాయలు బలపడి 228 గా అయింది. ఇది ఎలా సాధ్యపడింది ఒక్క రోజులో ?
~ పార్ధసారధి పోట్లూరి