మైనారిటీలకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ నీరజ్ శంకర్ సక్సేనా, మరో అయిదుగురు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనివల్ల మెజార్టీ మతంలో జన్మించి నష్టపోతున్నామన్న భావన హిందువుల్లో కలుగుతోందని అభిప్రాయపడ్డారు. మతప్రాతిపదికన సంక్షేమ పథకాలను అమలు చేయకూడదని కోరారు. దీనికి ప్రతిగా మైనారిటీలను బలహీన వర్గాలుగా గుర్తించాలని జాతీయ మైనారిటీ కమిషన్(ఎన్సీఎం) సుప్రీంకోర్టునుఆశ్రయయించింది . రాజ్యాంగ పరమైన రక్షణలు ఉన్నప్పటికీ అసమానత, వివక్షకు గురవుతున్నామన్న భావన మైనారిటీల్లో ఉందని.. 46వ అధికరణానికి అనుగుణంగా ఈ గుర్తింపు ఇస్తే మంచిదని పేర్కొంది. ఈ మేరకు 40 పేజీల ప్రమాణ పత్రాన్ని సమర్పించింది.. మెజార్టీ వర్గీయుల ప్రాబల్యం అధికంగా ఉన్నందున ఈ ఏర్పాటు అవసరమని తెలిపింది.
మైనారిటీ నిర్వచనం మతం ఆధారమా లేక జాతి ఆధారమా ?
భారత దేశంలో నిజమైన మైనారిటీ లు ఎవరు ?అనేదే పెద్ద ప్రశ్న, మైనారిటీ నిర్వచనం మతం ఆధారమా లేక జాతి ఆధారమా ? జాతిహితం దృష్ట్యా దానిని ముందు సమీక్ష చేయాలి .రాజకీయ అధికారం కోసం మన దేశంలో అన్ని విషయాలను రాజకీయాలకు అనుకూల నిర్ణయాలు వ్యాఖ్యానాలు చేసుకొంటూ జాతి ని తప్పుదారి పట్టిస్తున్నారు. దేశంలో భౌగోళిక వ్యవస్థ నుండి అన్ని విషయాలు రాజకీయాలే త్రిప్పుతున్నాయి. ఇది ఇప్పటికే దేశానికీ ఎంతోనష్టం చేసింది. రాజకీయాలు దేశ ప్రజలను చీల్చటం ఇంకా ఎంతకాలం సాగుతుంది? రాజకీయాలను దేశహితం కోసం ప్రజలే నడిపించటం ఎప్పుడు నేర్చుకొంటారు?