పొరుగు దేశం పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మరోసారి బయట పెట్టుకోంది. భారత్ లో నరేంద్ర మోడీ నాయకత్వంలో మరోసారి కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఈనెల నాలుగో తేదీన భారత పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. . ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ రావడంతో ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ఎన్నికల కావడం ఖాయం అయింది.
అటువంటి సందర్భాల్లో ఇరుగుపొరుగు దేశాలు సాధారణంగా శుభాకాంక్షలు తెలియజేస్తాయి. దౌత్యపరమైన సంబంధాల్లో ఇటువంటివి సహజం.
కానీ పాకిస్తాన్ ఇటువంటి మర్యాదలు ఏమాత్రం పాటించలేదు. గౌరవపూర్వకంగా శుభాకాంక్షలు ప్రకటన కూడా చేయలేదు. అలాగే మోదీ ప్రమాణస్వీకారం ఉత్సవానికి..
పాకిస్తాన్ నుండి ఎవ్వరూ హాజరు కాలేదు. ప్రధాని మోదీ తిరిగి ఎన్నికపై సుమారు 75 దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలపగా, పాకిస్తాన్ నుండి ఎటువంటి అభినందనలు కూడా లేకపోవడం గమనార్హం.
చాలా కాలంగా ఎదురుచూస్తున్న చైనా పర్యటనను దృష్టిలో ఉంచుకుని.. పాకిస్తాన్ దేశాధినేతలు
భారత్ కు వచ్చే పరిస్థితులలో లేరని అక్కడ దౌత్య వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ మళ్లీ ఎన్నిక కావడం, కొన్నేళ్లుగా దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల మధ్య పాకిస్థాన్తో భారత్ భవిష్యత్తు సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఊహాగానాలకు ఈ పరిణామం తెరలేపింది.
షెహబాజ్ షరీఫ్ కొద్దీ నెలల క్రితం తిరిగి ప్రధానిగా ఎన్నికైన సందర్బంగా.. అప్పట్లో మర్యాదపూర్వకంగా మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ కాంగ్రెస్ను భారత్లో తిరిగి అధికారంలోకి రావాలని పాక్ నేతలు కోరుకుంటున్నారని పదే పదే ఆరోపించారు.
కాగా, భారత్తో సహా అన్ని పొరుగు దేశాలతో “సహకార” సంబంధాలను కోరుకుంటున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం మొక్కుబడి గా తెలిపింది దశాబ్దాలుగా కొనసాగుతున్న సంఘర్షణకు కేంద్రంగా మారిన కాశ్మీర్ వివాదంతో సహా అన్ని సమస్యలను పరిష్కరించడానికి “నిర్మాణాత్మక చర్చలు, సంబంధాలు” అవసరమని తెలిపింది.
“పాకిస్తాన్ శాంతియుత సహజీవనాన్ని విశ్వసిస్తుంది. మేము ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నాము” అని పాకిస్తాన్ విదేశాంగ ప్రతినిధి ముంతాజ్ బలోచ్ అపేర్కొన్నారు. పాకిస్తాన్ తన లోక్సభ ఎన్నికల ఫలితాలపై భారతదేశాన్ని ఇంకా ఎందుకు అభినందించలేదని అడిగిన ప్రశ్నకు, విదేశాంగ కార్యాలయం తప్పించుకునే సమాధానం ఇచ్చింది. “తమ నాయకత్వం గురించి నిర్ణయించుకోవడం భారతదేశ ప్రజల హక్కు” అని పేర్కొంది.
కొత్త ప్రభుత్వం ఇంకా ప్రమాణస్వీకారం చేయనందున, ప్రధాని మోదీని అభినందించడం గురించి మాట్లాడటం “అసందర్భం” అంటూ ఆమె తప్పించుకున్నారు. “కాబట్టి, మీ ప్రశ్నపై నేను వ్యాఖ్యానించే స్థితిలో లేను” అని ఆమె పేర్కొన్నారు. 2019 ఆగస్టు 5న భారత పార్లమెంట్ ఆర్టికల్ 370ని సస్పెండ్ చేసిన తర్వాత పాకిస్థాన్ భారత్తో తన సంబంధాలను తగ్గించుకుంది.
మొత్తం మీద నరేంద్ర మోడీ తిరిగి ఎన్నిక కావడం పాకిస్తాన్ కు ఏమాత్రం ఇష్టం లేదు అని మరోసారి అర్థం అవుతుంది. పాకిస్తాన్ తోక ఎప్పుడూ వంకరే అని స్పష్టమైంది.