వాట్సప్కు నోటీసులతో పాటు చురకలంటించిన సుప్రీం
ప్రైవసీ పాలసీ విషయంలో యూజర్లను టెన్షన్ పెట్టిన వాట్సాప్కు సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది. వాట్సాప్ సంస్థతోపాటు దాని మాతృసంస్థ ఫేస్బుక్కు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై దాఖలైన పిటిషన్పై సుప్రీం విచారణ జరిపింది. నాలుగు వారాల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలంటూ.. వాట్సాప్,ఫేస్బుక్లకు ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో ఆ సంస్థలకు చరుకలంటించింది. మీ సంస్థ లక్షల కోట్ల డాలర్ల కంపెనీ కావచ్చమో.. కానీ ప్రజల వ్యక్తిగత భద్రత అనేది వాళ్లకు అత్యంత విలువైనదని.. ఆ ప్రజల భద్రతను రక్షించే విధి మాది అంటూ చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.