జీ 20 దేశాల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో నిర్వహణ, సన్నాహాలకు సంబంధించి ఏ బాధ్యత ఇచ్చినా చేపట్టి నెరవేరుస్తానని ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సదస్సు విజయవంతానికి ఏపీ తరపున ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకైనా సిద్ధమన్నారు. జీ 20 సదస్సు-సన్నాకహాలు, వ్యూహాలపై చర్చించేందుకు సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రధాని అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి జగన్ హాజరయ్యారు.