ప్రధాన ఎన్నికల అధికారి నియామకంలో పారదర్శకత లేదు అని సుప్రీంకోర్టు జస్టిస్ KM జోసెఫ్ పేర్కొన్నారు. అంతే కాదు, ఆ నియామక కమిటీ లో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఒకరు అయితే ఇంకా చాలా బాగుంటుంది అని కూడా సూచించారు.

image source : Live Law.
ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ధనంజయ మహాపాత్ర అనే ఆయన ఒక కథనం రాస్తూ ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న 27 మంది జడ్జీలలో ఆరుగురు న్యాయవ్యవస్థ కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన వారు అని పేర్కొన్నారు.

Image Source : Times of India
మహా పాత్ర గారు ఇంకా రాస్తూ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఉన్న కొలీజం వ్యవస్థ న్యాయమూర్తులను ఎంపిక చేసేటప్పుడు ప్రాంతీయ ప్రాధాన్యతలు, మెరిట్, సీనియారిటీ వంటివి తప్పక పరిగణలోకి తీసుకోవాలని 1990లో వచ్చిన జడ్జిమెంట్స్ పేర్కొన్నాయి.
అయితే, జడ్జీల నియామకం చేసేటపుడు ఈ సూచనలను అసలు పట్టించుకోవడం లేదు. న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న వారి మాటలు ప్రకారం ఈ కొలీజియం పద్ధతి పూర్తిగా పారదర్శరహితంగా ఉన్నదని జడ్జిలు నియామకంలో కుటుంబ నేపథ్యం ప్రాధాన్యత వహిస్తుందని అనుకుంటున్నారు అని మహాపాత్ర రాశారు.
జస్టిస్ వైవిచంద్ర చూడ్, జస్టిస్ కె ఎం జోసఫ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సుధాంస్ ధూలియా మొదలగువారు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీ జడ్జిల కుటుంబ నేపథ్యం ఉన్నది అని కూడా వారు రాశారు.
అలాగే కొలీజియం నియామక పద్దతిలో చాలా సార్లు చాలామంది సీనియర్లను త్రొక్కి పెట్టి వారి కంటే జూనియర్లకు పదవులలో నియామకం జరుగుతోంది, ఉదాహరణగా ఈ మధ్య సుప్రీం కోర్టుకి నియమింపబడిన జస్టిస్ ధూలియ 23 మంది హైకోర్టు చీఫ్ జస్టిస్ లను లేదా యాక్టింగ్ సీజేలను మరియు ఆరుగురు హైకోర్టు జడ్జీలను దాటుకొని నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చారు.
అలాగే జస్టిస్ పార్థివాల అయితే ఏకంగా దేశంలో గల అందరూ హైకోర్టు చీఫ్ జస్టిస్ లేదా యాక్టింగ్ చీఫ్ జస్టిస్ లను మరియు 25 మంది హైకోర్టు జడ్జిలను దాటుకొని నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చారు అని మహా పాత్ర రాశారు.
మిగతా రాజ్యాంగ వ్యవస్థలలో లోపాల ను ప్రశ్నించే ముందు న్యాయవ్యవస్థ కూడా ముందుగా తనని తాను ప్రక్షాళన చేసుకోక పోతే దేశ భవిష్యత్తు కి ప్రమాదం.