పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్ బెయిల్ పై విడుదలయ్యారు. విడుదల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. అసలు హిందీ పేపర్ ని ఎవరైనా లీక్ చేస్తారా అని ప్రశ్నించారు. TSPSC లీకేజీ కేసుని ప్రస్తావించిన సంజయ్… సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.జైళ్లు, లాఠీ దెబ్బలు తనకు కొత్త కాదని, యుద్ధానికి సిద్ధం అని సంజయ్ తెలిపారు. అసలు ఎవరో ప్రశ్నపత్రం పంపిస్తే నాకేం సంబంధం? అని ప్రశ్నించారు. నిత్యం ఎంతోమంది తనతో సెల్ఫీ తీయించుకుంటారని, అందరితో తనకు లింక్ ఉన్నట్టేనా అని నిలదీశారు. పేపర్ లీక్ తో సంబంధం లేదని తాను ప్రమాణం చేస్తానని…కుట్ర లేదని సీపీ ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ఎంపీనని చూడకుండా తనపట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఆరోపించారు.