ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం వద్దు అని మోదీ చెప్పినట్లుగా ప్రచారం చేసేస్తున్నారు.. ఇంకేముంది, కాంగ్రెస్ నేతలు, కమ్యూనిస్టు కాకలు రెచ్చిపోయి పోస్టింగులు పెడుతున్నారు. మహిళలకు శత్రువుగా నరేంద్ర మోదీని ఫిక్స్ చేసి పెట్టేస్తున్నారు.
అసలు జరిగిందేమిటో ఒకసారి చూద్దాం. కొంతకాలం హైదరాబాద్ మెట్రో రైల్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి కుండ బద్దలు కొట్టారు. పిల్లలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల లేడీస్ అంతా బస్సుల వైపు వెళ్లిపోయారని,, దీంతో మెట్రోలో ప్రయాణికుల సంఖ్య సగానికి సగం తగ్గిపోయిందని వాపోయారు. ఆయన కొన్ని లెక్కలు కూడా చెప్పారు. గడచిన రెండు సంవత్సరాల కాలంలో ఏ నెలలో ఎంత మంది ప్రయాణికులు ఉపయోగించుకున్నారు వివరాలు అందించారు. గడచిన నాలుగు నెలలుగా పరిస్థితి దుబ్బరంగా మారిందని ఇలా అయితే మెట్రో రైలు అమ్మేసుకుంటాము లేదా మూసేసుకుంటామని స్పష్టం చేశారు. ఇదే మాదిరిగా బెంగళూరు మెట్రో రైల్ ఎండి కూడా ఇదే వైఖరి వినిపించారు.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒక విలేఖరి ఇంటర్వ్యూ చేస్తూ రైలు సర్వీసుల గురించి ప్రశ్నలు అడిగారు. వందే భారత్, దురంతో, మెట్రో రైల్ వంటి ప్రయోగాలు విజయవంతం అయ్యాయని నరేంద్ర మోడీ వెల్లడించారు. హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాల్లో మెట్రో రైలు నష్టాలు ఎదుర్కొంటుంది కదా అని ఆ విలేఖరి కొనసాగింపుగా ప్రశ్న వేశారు. దీనికి సమాధానం చెబుతూ ..రెండు మూడు నగరాల్లో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారని, దీంతో మెట్రోల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గిందని అధికారుల వెర్షన్ ను మోదీ ఉదహరించారు. అంతకుమించి స్త్రీల గురించి కానీ, మహిళా సాధికారత గురించి కానీ ఒక్క మాట మాట్లాడలేదు.
కానీ మోదీ వ్యతిరేక గ్యాంగ్ మాత్రం ఇంటర్నెట్ నిండా చెలరేగి పోతున్నారు. మహిళా లోకానికి అసలైన ద్రోహి మోదీ అంటూ పోస్టులు పెట్టేసి హల్చల్ చేస్తున్నారు. మోదీ అన్న మాటలు ఒకటైతే,, వీళ్ళు అంటున్న వక్ర భాష్యం మాటలు మరొకటిగా ఉంటున్నాయి. అందుచేత వాస్తవాలు గమనించాల్సిన అవసరం ఉంది.