హిందూ ఆలయాలను విముక్తం చేయమని అశ్వినీ ఉపాధ్యాయ అనే ఆయన సుప్రీం కోర్టులో PIL దాఖలు చేశారు. ఈ PIL లో అశ్వనీ ఉపాధ్యాయ లేవనెత్తిన అంశాలు సంక్షిప్తంగా ఇవి..
భారతదేశంలో గజనీ, గోరీ, ఔరంగజేబు మొదలైన ముస్లీం ఆక్రమణ దారులు భారతదేశంలోని ఆలయాలను, జైన మందిరాలను, బౌద్ద మందిరాలను కూల్చి మసీదులు, దర్గాలు నిర్మించారు. దాదాపు 30 వేల మందిరాలు ధ్వంసం చేయబడ్డాయి. వీటిలో ప్రథానమైనవి 3వేల మందిరాలు. వాటిని మరలా హిందువులు తిరిగి సంపాదించుకునే అవకాశం లేకుండా, కనీసం కోర్టుకు వెళ్ళి తమకు న్యాయం చేయమని అడిగే అవకాశంకూడా లేకుండా 1991 లో నరసింహరావు నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్దుల ధార్మిక హక్కును కాలరాసే చట్టం.
ఈ చట్టం లోని ముఖ్య అంశాలు చూద్దాం.
హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్దులు ఇప్పరకూ తమ ధ్వంసం కాబడిన మందిరాల కోసం వేసిన కేసులన్నీ నిర్వీర్యం అవుతాయి. ముస్లీములను తృప్తి పరచడం కోసం హిందూ బౌద్ద సిక్కు, జైనుల కు కోర్టుకు వెళ్ళే అధికారాన్ని కాలరాశారు.
భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ప్రజా స్వామ్య దేశంలో అందరికీ న్యాయం లభించడం అనేది మూలభూత సిద్దాంతం. ఈ చట్టం ప్రజాస్వామ్య మూలభూత సిద్దాంతానికి విఘాతం కలిగిస్తుంది.
ఈ చట్టం ప్రజస్వామ్యాన్ని మూక స్వామ్యంగా తయారు చేస్తుంది. మీకు కోర్టుకు వెళ్ళి న్యాయం పొందే అవకాశం లేదు కాబట్టి మీరు కర్రలు కత్తులు తీసుకుని మీ హక్కును మీరు సంపాదించుకోండి అని ఒక రకంగా హిందూ బౌద్ద సిక్కు జైనులకు చెప్పడమే.
రూల్ ఆఫ్ లా అనేది ఆర్టికల్ 14 లో ఒక అంతర్గత అంశం. ఆర్టికల్ 14 మన రాజ్యాంగానికి హృదయం లాంటి ముఖ్యమైన అశం. 1991 చట్టం రాజ్యగం లోని ఆర్టికల్ 14 కు విఘాతం కలిగించే చట్టం.
ఆర్టికల్ 15 ప్రకారం హిందూ లా ప్రకారం ఆలయంలోని మూల విరాట్టు ఆ ఆలయానికి హక్కుదారు. అంతే కాకుండా ఆ స్వామికి మనిషికి ఉన్న హక్కులన్నీ ఉంటాయి. అంటే రాముడు, కృష్ణడు, దేవీ, దేవతలకు కోర్టు తలుపులు తట్టే అధికారం ఉంది. రాముడికి కోర్టు ద్వారా న్యాయం చేసి, కృష్ణుడికి న్యాయం చేయడం అనడానికి అధికారం లేదు. అయోధ్యను విముక్తం చేశాము, కాశీ మధుర ఇతర ఆలయాలకు ఆ హక్కు లేదు అనడం ఆర్టికల్ 15 ను విభేదించమౌతుంది. 1991 చట్టం రామమందిర వివాదం కోర్టు తీర్పు ఇవ్వవచ్చు కానీ మధుర వివాదాన్ని కోర్టు స్వీకరించదు అనడం ఎంత వరకు సమంజసం.
ఆర్టికల్ 21 ప్రకారం కోర్టుకు వెళ్ళడం ప్రతి పౌరుని హక్కు. 1991 చట్టం ఈ ప్రాధమిక హక్కును కాలరాస్తుంది.
ఆర్టికల్ 25 సిక్కులు, బౌద్దులు, జైనులు హిందువులకు తమ చారిత్రాత్మక, తమ ఆధ్యాత్మిక స్థలాలను రక్షించుకునే హక్కు, పునర్ నిర్మించుకునే హక్కు కలుగ జేస్తుంది. అంతే కాకుండా ఇతరు ఆక్రమించిన స్థలాలను తిరిగి పొందే హక్కును కూడా ఇస్తుంది. 1991 చట్టం ఈ హక్కుని దిక్కరిస్తుంది.
ఇతరుల ధార్మిక స్థలాలను లేదా వివాదాస్పద స్థలాలను ఆక్రమించి మసీదులు నిర్మించకూడదు అని ఇస్లామిక్ షరియా చెబుతుంది. ఇక దర్గా అనేది ఇస్లాంలో లేనే లేదు. అంతే కాకుండా మసీదు ఒక ప్రార్థనా స్థలం మాత్రమే దానిని ఎక్కడకైనా మార్చుకోవచ్చు అని చెబుతుంది. ఈ 1991 చట్టం ఈ షయరియా చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తుంది.
1991 చట్టం అటు హిందూ, బౌద్ద, జైన, సిక్కుల మౌలిక అధికారాలను కాలరాయడమే కాకుండా ముస్లీం షరియాకు కూడా వ్యతిరేకమైన చట్టం.
పైన చెప్పిన విషయాలన్నింటినీ వివరిస్తూ అశ్వినీ ఉపాథ్యాయ సుప్రీం కోర్టులో PIL దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ఈ కేసు విచారణకు అంగీకరించింది.
అయితే భారతదేశంలో చట్టాలు చేయడం వాటిని అమలు చేయడం లేదా అమలు చేయించుకోవడం అనేది ఆయా సమూహాల ఐక్యతపైన ఆధారపడి ఉంటుంది. ఒక చట్టం చేయాలన్నా లేదా చట్టాన్ని రద్దుచేయాలన్నా ప్రజల ఆంధోళన ఆక్రోశం అవసరం. కాబట్టి మన దేవాలయాలను మనం రక్షించుకోవాలి, హిందువులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దు చేయాలంటే హిందువుల ఐక్యత, హిందువుల ఆంధోళనలు చాలా ప్రముఖపాత్ర పోషిస్తాయి.
అశ్వినీ ఉపాధ్యాయ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన హిందు వ్యతిరేక చట్టాలపై పోరాడుతున్నాడు. మరి మీరు……
-మదన్ గుప్త