ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూ లు ను తాలిబాన్ స్వాధీనం చేసుకోవడం ప్రపంచమంతా భయాందోళనలకు గురి అవుతున్నది, ఎందుకంటే1) 1996లో తాలిబాన్ ల రాజ్యం ఎంత కిరాతకంగా ఉన్నదో ప్రపంచ మంతా చూసింది. ఆ విషయాలు పదే పదే జ్ఞాపకం వచ్చే అవకాశం ఉంది, ఆ పరిస్థితులు తిరిగి తల ఎత్తితే దాని ప్రభావం ప్రపంచంలోని అనేక దేశాల పై పడే అవకాశం ఉంది, 2) ఒక ప్రక్క తాలిబాన్ గురించి ఆందోళన ఉంటే, మరో ప్రక్క ప్రపంచాన్ని ఆశ్చర్యానికి లోనుచేసిన మరో అంశం గడిచిన అనేక సంవత్సరాలుగా తాలిబాన్లను ఎదుర్కొనేందుకు అమెరికా సైన్యం ఆఫ్ఘన్ సైన్యానికి శిక్షణ ఇస్తూ ఉన్నది, అంతగా శిక్షణలేని తాలిబాన్ ల చేతిలో ఆఫ్ఘన్ సైన్యం ఓడిపోవడం సురక్షిత ప్రాంతాలకు పారిపోవడం 3) మూడో విషయం ఆఫ్ఘన్లో విదేశీయులు స్థానిక తాలిబాన్ వ్యతిరేకులు ప్రాణభయంతో పరుగులు తీసిన హృదయవిదారక దృశ్యాలు ప్రచార మాధ్యమాల్లో ప్రపంచమంతా చూసింది, అక్కడి పరిస్థితులను కేవలం ఆయా దేశాల పాలకులకు మాత్రమే కాదు విశ్లేషకులు రాజనీతిజ్ఞులు విశేష అధ్యయనం చేస్తున్నవారందిరికి అందోళనకలిగిస్తున్నది,రాబోవు పరిస్థితులు ఎట్లా ఉంటాయో అనే విషయంపై మల్లు గుల్లాలు పడుతున్నారు, ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళు చేస్తున్నారు.ఆఫ్ఘన్ ప్రజలకు ప్రపంచ దేశాలు ఆర్ధిక నైతిక సహకారము అందించవలసిన అవసరం ఎంతో ఉంది, ఒక పక్క తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించాలా వద్దా అనే మీమాంస రెండవ ప్రక్క దశాబ్దాలుగా యుద్ధాలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం కనపడుతున్నది ఉన్నది అనే ఆలోచన సాగుతున్నది . ఆఫ్గనిస్తాన్ లో మానవత్వం గెలుస్తుందా? రాక్షసత్వం రాజ్య మేలుతుందా కాలం తేల్చాలి. ఇంకొక ప్రక్క తాలిబాన్ అంతర్జాతీయంగా ఉన్న పాలనాపరమైన నా మార్గాన్ని ఎన్నుకుంటుంది, లేక తన పూర్వ పాలనమార్గంలో వెళుతుందా ఇప్పుడే చెప్పలేం. తమ దేశాన్ని పునర్నిర్మాణం చేసుకునేందుకు తాలిబాన్లు ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు సామాన్య ప్రజలను రక్షించేందుకు సిద్ధపడి విదేశీయుల సహాయ సహకారం మీద మాత్రమే ఆధారపడకుండా ఉండగలుగుతుందా చూడాలి
చైనా డేగ కళ్ళు ఆఫ్ఘన్ పై పడ్డాయా ?
అంతర్జాతీయ విశ్లేషణ వెబ్సైట్ ‘ఇన్సైడ్ఓవర్‘కు రాసిన వ్యాసంలో.. ఫెడెరికో గియులియాని అనే రచయిత చైనా వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పొరుగు దేశం నుంచి అమెరికా వైదొలగటం పట్ల బీజింగ్ సంతోషంగా ఉందన్నారు.”మధ్య ఆసియాలో తన ఆధిపత్యం కోసం బీజింగ్ సుదీర్ఘకాలంగా ప్రయత్నిస్తోంది. రష్యాతో పాటు షాంఘై సెంట్రల్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రాంతీయ గతిశీలతను మార్చాలని భావిస్తోంది. అయితే.. చాలా కాలంగా తన ప్రణాళికల్లో అఫ్గానిస్థాన్ లేదు. నిజానికి అఫ్గానిస్థాన్లో అమెరికా బలగాల మోహరింపు ఓ విధంగా చైనాకు అవసరమైన భద్రతా, దాని ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి ఉపయోగపడింది. కానీ అమెరికా, ఇతర దేశాలతో కలిసి పనిచేసేందుకు బీజింగ్ ఎప్పుడూ ముందుకు రాలేదు. పాశ్చాత్య దేశాల నిష్క్రమణ ఇప్పుడు అఫ్గానిస్థాన్పై చైనా తన ముద్ర వేయడానికి అవసరమైన మార్గాన్ని అందించింది.”
భారత్ భయమదే..
అఫ్గానిస్థాన్(Afghanistan News) ఉగ్రకార్యకలాపాలకు కేంద్రబిందువు కాకుండా చూడటమే తమ లక్ష్యమని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందర్ బాగ్చీ గురువారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ తాలిబన్లతో కతర్ వేదికగా తొలిసారి అధికారిక చర్చలు జరిపింది. మంగళవారం జరిగిన ఈ భేటీలో తాలిబన్ల నాయకుడు మహమ్మద్ అబ్బాస్ స్తానెక్జాయ్ పాల్గొన్నారు. భారత్ వ్యతిరేక కార్యకలాపాలు, తీవ్రవాదానికి అప్గాన్ నిలయం కావొద్దని చర్చ జరిగింది. అఫ్గాన్లో ఇంకా ఉన్న భారతీయులు, అక్కడి నుంచి భారత్ రావాలనుకుంటున్న అఫ్గాన్ పౌరుల అంశపైనా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.
భారత్ కు ఆఫ్గనిస్తాన్ పరిణామాలు కీలకమా ?
ఆఫ్గనిస్టాన్ లో భారత్ నిర్వహించిన పాత్ర చాలా విశేష మైనది, తాలిబన్ పాకిస్థాన్ ప్రభావంలో ఉన్న కారణంతో ఒకప్రక్క ప్రమాదం మరోవైపు ఆఫ్ఘన్ ప్రజల సంస్యలల్సమసిప్రజాస్వామ్యము అభివృద్ధి ఆకాంక్షించి ఒంటరిగానే భారత్ పని చేయవలసి వచ్చింది,భారత్ 2001 నుండి ఆఫ్ఘన్లో దేశవ్యాప్తంగా రోడ్లు ఆనకట్టలు విద్యుత్ లైన్లు వైద్యశాలలు పాఠశాలలు నిర్మించే మౌలిక సదుపాయాలు నిర్మాణం చేసింది దానికి సుమారుగా 3 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది ,ఇదంతా తాలిబన్ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ చేసింది కాబట్టి ఆ పనులు కొనసాగింపు గాని తాలిబాన్ ప్రభుత్వం వాటిని గుర్తించడంగాని ఎట్లా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము. తాలిబన్లతో చర్చించటానికి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, భారత్ చేపట్టిన అభివృద్ధి పనులను ఒక సందర్భంలో తాలిబన్లు ప్రస్తావించటం కారణంగా సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఉంటాయా గమనించాలి, తాలిబాన్లలో కూడా అతివాదులు మితవాదులు ఉన్నట్లు చాలామందికి అభిప్రాయం కలుగుతోంది అధికారం అతివాదుల చేతుల్లోకి వెళ్తే ఉగ్రవాదులకు సహకారం అందించటమే కాదు షరియా చట్టాన్ని అమలు కూడా చేసే అవకాశాలున్నాయి పాకిస్తాన్లో TTP వర్గం పాకిస్థాన్లో కూడా షరియా పాలన తీసుకురావాలని తమ లక్ష్యాన్ని పదేపదే ప్రకటిస్తున్నారు ఈ శక్తులు తాలిబాన్ తో కలిసి పోయే ప్రమాదం ఉన్నది ఉగ్రవాదుల దృష్టిలో పాకిస్తాన్ సమగ్రం కావాలంటే తమ చిరకాల వాంఛ అయిన కాశ్మీర్ ను ఆక్రమించాలి దానికి తాలిబన్ల సహకారంతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే అవకాశం కూడా ఉన్నది. ఇప్పటికే తాలిబన్లు నెల రోజుల క్రితం కాశ్మీర్ విషయంలో మేము జోక్యం చేసుకోము అని చెప్పారు కానీ నిన్నటి రోజున వాళ్లే ఒక పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాశ్మీర్ లోని ముస్లిం ల సమస్యను పట్టించుకుంటాము , ఎక్కడ ముస్లింలు సమస్యలలో ఉన్నా వాళ్ళ విషయం మేము ఆలోచిస్తాము అని మాట మాట్లాడారు, ప్రస్తుతం తం కశ్మీర్లో వేర్పాటువాదులు బలహీనంగా ఉన్నారు ఈ సమయంలో తాలిబాన్లు కశ్మీర్ పై దృష్టి సారించే అవకాశాలు అంతగా కనబడటం లేదు,కాశ్మీర్ లో కాశ్మీరులోయలో బలహీనంగా ఉన్న వర్గం మాత్రం పోరాటం చేస్తున్నది,తక్షణమే ప్రభావం చూపించలేదు అంతేకాక సూఫీ భావజాలం అంతర్లీనంగా ప్రభావం చూపే చోట తాలిబన్ల ఆలోచన ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తో పోలిస్తే భారత్ లోని ముస్లిములు ఆలోచనలు వేరుగా ఉండే అవకాశం కనపడుతున్నది, పస్థూన్ వాలీ ప్రవర్తనా నియమావళిని విశ్వసించే తాలిబన్ల అప్రజాస్వామ్యం, తిరోగమన వాదం వంటి మత నిర్దేశకాలను విశ్వసించ లేకపోవచ్చు, ఒక ప్రక్క బారాదారి, రెండవ ప్రక్క పఠాన్ ఆలోచనలు ఉన్నాయి ఈ రెండు కశ్మీర్ పై ప్రభావం చూపించక పోవచ్చు , స్తున్నారున్యూఢిల్లీ విధాన రూపకర్తలు కాశ్మీర్లో భవిష్యత్తు చిక్కులు ఎట్లా ఉంటాయి అనే అంశంపై అన్ని కోణాల నుండి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది తాలిబన్ ఉగ్రవాద పోకడలు ఇక్కడ కూడా ఉంటాయా అనే కోణం నుండి కూడా ఆలోచిస్తున్నట్టు విశ్లేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది, కాశ్మీర్ యొక్క ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత డాక్టర్ ఆర్ జి ఎన్ హబ్బీ అంచనా ప్రకారం చైనా, పాకిస్తాన్, మరియు తాలిబన్లు ఒక కొత్త ఫ్రంటు గా ఏర్పడవచ్చు వాళ్లు ఏకీకృతం గా పని చేయడానికి సిద్ధం కూడా కావచ్చు, అయినా ఇది కశ్మీరు ను అంతగా ప్రభావితం చేయలేక పోవచ్చు. ప్రస్తుత కాశ్మీర్ పరిస్థితిపై భారత ప్రధాన సైన్యాధిపతి మనోజ్ ముకుంద నారవాణే “కాశ్మీరులోయలో దాడులు గణనీయంగా తగ్గాయి పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయి అని చెప్తున్నారు“ఇంకొక ప్రక్క పాకిస్థాన్ నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందంచేసుకున్నప్పటికీ కాశ్మీర్ విషయంలో లోపాయికారిగా తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది అనేది స్పష్టంగా అర్థమవుతోంది , తాలిబన్లు భారతీయుల మధ్య సంబంధాలు ఎట్లా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం అవి ఎట్లా ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని పాకిస్తాన్ తప్పకుండా ఉపయోగించుకునే అవకాశం ఉంది, అందు కే ఈ విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది , దక్షిణ మధ్య ఆసియా లో శాంతి నెలకొనాలంటే తటస్థ ఆఫ్ఘనిస్థాన్ ఎంతో అవసరం దానికి భారత్ కాబుల్ కు అందుబాటులో ఉండటం మరింత అవసరము అని అని కొంతమంది అభిప్రాయం, పాకిస్తాన్ తాలిబాన్లలోని మిలిటెంట్ గ్రూపులు పీవోకేలో పనిచేసే తీవ్రవాద ఉగ్రవాద గ్రూపులు కలిసి పోయే ప్రయత్నించేయవచ్చు దానితో 1990 సంవత్సరం లో ఉన్న పరిస్థితులు తలెత్తే అవకాశాలను కొట్టిపారేయలేం, కాబట్టి భారత్ ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆప్ఘన్ లో చోటుచేసుకొంటున్నపరిణామాలు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తాలిబన్లను నిశితంగా గమనించవలసిన అవసరం యుద్ధ ప్రాతిపదికన ఉన్నదనేది నిస్సందేహం. తాలిబాన్లతో నైతిక రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ భారత్ ఆఫ్ఘనిస్తాన్ పై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉన్నది.
ఆఫ్ఘనిస్తాన్ నుండి యూరోపియన్ సరిహద్దు వరకు ఖలీఫాట్ ఏర్పాటుకు అవకాశాలు పరిశీలనలో ఉన్నాయి అనిపరిశీలకులు అంచనావేస్తూన్నారు
తాజాగా తాలిబన్లలో సాగుతున్న చర్చలు
తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై శనివారం తుది ప్రకటన వస్తుందని అంతా భావించారు. అయితే.. మరోమారు వాయిదా వేయటం వల్ల తాలిబన్ల మధ్య అంతర్గతంగా విబేధాలు ఉన్నాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుపై వివిధ గ్రూప్లతో చర్చించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు ఖలీల్ హక్కానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ఆమోదించేలా ఉండే విస్తృతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబన్లు భావిస్తున్నారని, అందుకే జాప్యం జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.
‘తాలిబన్లు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలరు. కానీ, వారి పరిపాలనా విభాగంలో అన్ని పార్టీలు, గ్రూప్లు, సమాజంలోని పలువురికి సముచిత స్థానం కల్పించాలని భావిస్తున్నారు. తాలిబన్లతోనే కూడిన ప్రభుత్వాన్ని ప్రపంచం ఆమోదించకపోవచ్చు. అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సోదరుడు గుల్బుద్దీన్ హెక్మాత్యార్కు ప్రభుత్వంలో స్థానం కల్పించనున్నారు. ప్రభుత్వానికి కూడగట్టేందుకు ఇతర భాగస్వామ్య గ్రూప్లతోనూ చర్చలు చేపడుతున్నారు.’
– ఖలీల్ హక్కానీ, ప్రభుత్వ ఏర్పాటు కమిటీ సభ్యుడు
చైనాతో దోస్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు తాలిబన్లు(taliban china connection). చైనా తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామిగా పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్(Afghan Taliban) పునర్నిర్మాణానికి చైనా సాయం కోసం చూస్తున్నట్లు చెప్పారు. రష్యాతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తామని చెప్పారు