దీదీ సర్కార్పై సంచలన ఆరోపణ చేస్తూ..టీఎంసీకి గుడ్బై చెప్పిన నేత..!
https://twitter.com/ANI/status/1368124452454633474
ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో వెస్ట్ బెంగాల్ రాజకీయంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఇన్నాళ్లు పరిపాలించిన మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ సారి ఓటమిని చవిచూడకతప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిని నిజం చేస్తున్నారు టీఎంసీ కీలక నేతలు. నామినేషన్ల ప్రక్రియ ముగియక ముందే.. టీఎంసీ నేతలు పార్టీకి గుడ్బై చెప్పేస్తున్నారు. అందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉండటంతో దీదీ సర్కార్ వెన్నులో వణుకుమొదలైంది. ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యులు దినేశ్ త్రివేదీ జేపీ నడ్డా సమక్షమంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ ఘటన నుంచి తేరుకోకముందే మరో కీలక నేత టీఎంసీకి షాకిచ్చారు. టీఎంసీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దినేశ్ బజాజ్ పార్టీకి గుడ్బై చెప్పారు. ఈ మేరకు పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జికి వ్యక్తిగత మెసేజ్ పంపించారు. ఇన్ని రోజులు పార్టీలో తనకు స్థానం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, దినేశ్ బజాజ్ 2006లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. బీజేపీలో చేరుతున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. అంతేకాదు.. తనకు ఎమ్మెల్యే సీటు ఇస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తానని తెలిపారు. పార్టీ తనకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వకపోయినా.. తాను టీఎంసీలో ఉండకూడదని నిర్ణయించుకున్నానన్నారు. అంతేకాదు.. టీఎంసీ పార్టీలో హిందీ మాట్లాడేవారిని వేరే దృష్టితో చూస్తారని సంచలన ఆరోపణ చేశారు. హిందీ మాట్లాడే వారిని టీఎంసీ బయటి వ్యక్తులుగా చిత్రీకరిస్తుందని.. ఇది సరైన విధానం కాదని దినేశ్ బజాజ్ అన్నారు.