MIM రజాకార్ ఎజెండాను అమలు చేయడంలో బాగంగానే రాజాసింగ్ గారిపై అక్రమంగా PD యాక్టు కింద కేసు నమోదు చేసిన KCR ప్రభుత్వం రాష్ట్రంలో దారుసలాం ఎజెండాను అమలు చేయాలని చూస్తుంది. రాజాసింగ్ గారిపై వందకు పైగా కేసులు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం వాటిలో ఎన్ని కేసులు అక్రమ కేసులో,ఎన్ని కేసులు కొట్టి వేయబడి రాజాసింగ్ నిర్దోషిగా బయటకు వచ్చాడో కూడా ప్రజలకు లెక్కప్పాలని VHP డిమాండ్ చేస్తుంది . హిందుత్వం కోసం పనిచేసే కార్యకర్తలపై నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి అణిచివేయాలని చూడటం అవివేకం, త్యాగాలకు సిద్దపడ్డ హిందుత్వ వాదులు కేసులకు అరెస్టులకు భయపడేది లేదు,మరింత ఉత్సహంగా పనిచేస్తారు.
హిందూ దేవి దేవతలను దూషించి భారత దేశంపై యుద్ధం ప్రకటించిన *MIM నేత అక్బరుద్ధీన్ ఓవైసీ పై KCR ప్రభుత్వం PD యాక్టు ఎందుకు పెట్టడం లేదు ?-సరైన సాక్ష్యాదారాలు లేవంటూ కొట్టివేసిన అక్బరుద్ధీన్ కేసుపై తెలంగాణా ప్రభుత్వం హైకోర్టులో ఎందుకు అప్పీల్ కు వెల్లడం లేదని?VHP ప్రశ్నించింది.
హిందూ విశ్వాసాలు గౌరవించాలని డిమాండ్ చేసిన రాజాసింగ్ పై PD యాక్టు నమోదు చేసిన KCR ప్రభుత్వం హిందువులను ఊచకోత కోస్తానన్న అక్బరుద్దీన్ కేసుపై కనీసం అప్పీల్ కు కూడా వెళ్ళకపోవడం సెక్యులరిజరా ? అని నిలదీశారు వీహెచ్పీ సహకార్యదర్శి రావినూతల శశిధర్. వెంటనే అక్బరుద్దీన్ కేసుపై అప్పీల్ కు వెళ్ళాలని డిమాండ్ చేశారు. రాజాసింగ్ గారి పై అక్రమంగా PD యాక్టు నమోదు చేసిన KCR ప్రభుత్వం బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని VHP డిమాండ్ చేసింది.