బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత వెయిట్లిఫ్టర్ల విజయ పరంపర కొనసాగుతోంది. 73 కేజీల పురుషుల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ అచింత షూలి స్వర్ణ పథకం గెలుచుకున్నాడు. దీంతో అచింత షూలి భారత్కు 3వ స్వర్ణం అందించాడు. బెంగాల్కు చెందిన ఈ 20 ఏళ్ళ యువ వెయిట్ లిఫ్టర్ 313(143+170) కేజీల బరువును ఎత్తి సత్తా చాటాడు.
మలేషియాకు చెందిన ఎర్రి హిదాయత్ మహ్మద్ 303 కేజీలను ఎత్తి ద్వితీయ స్థానంలో నిలిచాడు. కెనడాకు చెందిన షాద్ దార్సిగ్నీ 298 కేజీలు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు.
అచింత విజయం సాధించినందుకు ప్రధాని మోదీ కూడా అభినందనలు తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్ కు భారత బృందం బయలుదేరే ముందు అచింత షూలితో తన చర్చకు సంబందించిన క్లిప్ను కూడా ప్రధాని ట్వీట్ చేశారు. తన తల్లి, సోదరుడి నుంచి అతనికి లభించిన మద్దతు గురించి నాతొ చెప్పాడు.. పతకం సాధించడంతో ఇప్పుడు సినిమా చూసేందుకు సమయం లభిస్తుందని ఆశిస్తున్నా అని అన్నారు. ఈ ప్రత్యేక విజయం కోసం అతను చాలా కష్టపడ్డాడు. అతని భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు. అని మోదీ ట్వీట్ చేశారు.
https://twitter.com/AkshatSaraf/status/1553935112114667521?s=20&t=B83knINm-j_xBPzMkyux3Q
మీరాబాయి చాను శనివారం ఫైనల్లో మహిళల 44 కేజీల వెయిట్లిప్టింగ్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని గెలుపొందింది. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్లో మొత్తం 201 కేజీలు ఎత్తిన మీరాబాయి చాను పసిడి పతకాన్ని భారత్కి అందించింది. భారత్కి శనివారం వెయిట్లిప్టింగ్లో మూడు పతకాలు లభించాయి. తొలుత ఫురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ సాగర్ రజత పతకం గెలుపొందగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే 61 కేజీల విభాగంలో గురురాజ పూజారి కాంస్య పతకాన్ని భారత్కి అందించాడు. అనంతరం మీరాబాయి చాను గోల్డ్ మెడల్తో మెరిసింది.