‘అగ్నిపథ్(Agnipath)’పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ… వేళ పలువురు దేశీయ కార్పొరేట్ దిగ్గజ సంస్థలు అగ్నిపథ్ కు మద్దతునిస్తున్నాయి. అంతేకాదు నాలుగేళ్ల తర్వాత బయటకొచ్చే అగ్నివీర్ లకు తమ కంపెనీల్లో ఉద్యోగాలిస్తామంటున్నారు. ఆనంద్ మహీంద్రా ఇప్పటికే ఆ ప్రకటన చేయగా..ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా కూడా అదే మాటన్నారు. ఆనంద్ మహింద్రా ట్వీట్ను జతచేస్తూ.. అగ్నివీరుల నియామకానికి ఆర్పీజీ గ్రూపు ఉపాధి అవకాశాలు కూడా స్వాగతం పలుకుతాయని హర్ష గోయెంకా అన్నారు. ఇతర కార్పొరేట్లు కూడా తమలాగే ప్రకటన చేస్తారని ఆశిస్తున్నామన్నారాయన. “మన యువత భవితకు భరోసా కల్పిద్దాం’’ అని హర్ష ట్వీట్ చేశారు.