మహారాష్ట్ర రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో
దేవేంద్ర ఫడ్నవీస్తో భేటీఅయ్యారు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే. ఏక్నాథ్ షిండే కష్టాల్లో ఉంటే తన పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) ఆయనకు మద్దతు ఇస్తుందని అన్నారు. శివసేనతీరుపైనా మండిపడ్డారు అథవాలే .
“ఇప్పుడున్న ప్రభుత్వం మైనారిటీలో ఉంది. ఏక్నాథ్ షిండే వెంట మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు.షిండేకు రక్షణ కల్పించాలి” అని RPI చీఫ్ అన్నారు.
“ఎమ్మెల్యేలు మీ వద్దకు వస్తారని మీరు అనుకుంటున్నారు. వారు అవసరమైనప్పుడు తిరిగి వస్తారు. కానీ అప్పటి వరకు, వారిని బెదిరించే ప్రయత్నం చేయకండి” అనీ హితవు పలికారు.
శివసేన-NCP-కాంగ్రెస్ MVA ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది, షిండే పెద్ద సంఖ్యలో శివసేన ఎమ్మెల్యేలతో దూరంగా వెళ్ళిపోయాడు. థాకరే పనితీరును విమర్శిస్తూ మొదట సూరత్లో.. తరువాత గువాహతిలోని ఒక విలాసవంతమైన హోటల్లో బైఠాయించాడు. గత కొన్ని రోజులుగా షిండే శిబిరంలో తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతూ వచ్చి.. MVA ప్రభుత్వ కొనసాగింపుపై కష్టమనేలా పరిస్థితులున్నాయి.