మహారాష్ట్రలో రాజకీయం రసకందాయంలో పడింది. 26 మంది ఎమ్మెల్యేలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిన శివసేన నేత ఏక్నాథ్ షిండే చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. అధికారం కోసం బాలాసాహెబ్ మార్గాన్ని వీడి తమ ఆత్మగౌరవాన్ని చంపుకోలేమన్నారు. తాము
దృఢమైన శివసైనికులని, శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ తమకు హిందుత్వాన్ని నేర్పారని అన్నారు.
आम्ही बाळासाहेबांचे कट्टर शिवसैनिक आहोत… बाळासाहेबांनी आम्हाला हिंदुत्वाची शिकवण दिली आहे.. बाळासाहेबांचे विचार आणि धर्मवीर आनंद दिघे साहेबांची शिकवण यांच्याबाबत आम्ही सत्तेसाठी कधीही प्रतारणा केली नाही आणि करणार नाही
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) June 21, 2022
షిండే, 26 మంది మహారాష్ట్ర ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్లోని సూరత్లోని ఓ రిసార్ట్లో క్యాంప్ వేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ ప్రచారం మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో తిరుగుబాటు ఊహాగానాలకు ఆజ్యం పోసింది. అటు తాజాసంక్షోభం నేపథ్యంలో ఏకనాథ్ షిండేపై పార్టీ వేటువేసింది. శాసనసభాపక్షనేత పదవినుంచి ఆయన్నితొలగించింది.
అటు మహాలో పరిణామాలు, సంక్షోభానికి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ అన్నారు.
MLC ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష BJP అగ్రస్థానంలో నిలిచింది. అధికారపార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు.
ఇక 288 సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన కు 55మంది ఎమ్మెల్యేలున్నారు. ఎన్సీపీకి 53, కాంగ్రెస్ కు 44, బహుజన్ వికాస్ అఘాడీకి 3,.సమాజ్ వాదీకి 2, ఎంఐఎంకి 2, ప్రహర్ జనశక్తి పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.
బీజేపీకి 106 మంది సభ్యుల బలం ఉంది.