కెసిఆర్ కి ఇక నిద్ర లేకుండా చేస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.హుజూరాబాద్ లో పర్యటిస్తున్న అరవింద్ కేసీఆర్ లక్ష్యంగా నిప్పులుచెరిగారు.25 ఏళ్ల కింద దళిత చైతన్య జ్యోతి మొదలు పెడితే ఎందుకు ఇంకా సిద్దిపేట దళితులు కోటీశ్వరులు కాలేదని ప్రశ్నించారు.
నువ్వు కట్టిన డబుల్ బెడ్ రూం ఇల్లు కూలి పోతున్నాయి.
పొంకనాలు కొడితే లిమిట్ ఉండాలి
నరుకుడు పోషెట్టి మాటలు బంద్ చెయ్ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
ఇండియా టుడే సర్వే లో Top 10 సీఎంలలో కేసీఆర్ లేడని, రోజురోజుకూ ఆయన స్థానం దిగజారుతోందనీ అన్నారు.
కరోనా వల్ల దళిత బంధు ఆగింది అంటున్న కేసీఆర్ మరి ghmc ఎన్నికలు ఎలా పెట్టుకున్నారో చెప్పాలన్నారు.
దళిత బంధు క్రెడిట్ కేవలం ఈటల రాజేందర్ కే దక్కుతుందని అరవింద్ అన్నారు.