ప్రధానిని చంపేస్తామంటూ ఓ ఆగంతుకుడు సాక్షాత్తూ ఎన్ఐఏకు పంపిన మెయిల్ కలకలం రేపుతోంది. మోదీ మాత్రమే కాక వేలాదిమందిని హత్య చేసేందుకు కుట్ర పన్నామని మెయిల్లో పేర్కొన్నాడు. ఎన్ఐఎ ముంబై బ్రాంచ్ కు ఈ మెయిల్ రావడంతో అంతా అప్రమత్తం అయ్యారు.
ప్రధానిని హత్య చేసేందుకు ఇప్పటికే పథకం సిద్ధమైపోయిందని..అమలు చేసేందుకు వేచి చూస్తున్నామని ఆ మెయిల్లో పేర్కొన్నాడు దుండగుడు. పలు ఉగ్రసంస్థలు ఐక్యంగా కుట్రను అమలుచేయబోతున్నాయని … అందుకోసం ఇప్పటికే 20మంది స్లీపర్ సెల్స్ ను రంగంలోకి దించినట్టు పేర్కొన్నాడు. అంతే కాదు 20 కిలోల ఆర్డీఎక్స్ సైతం సిద్ధం చేస్తున్నట్టు చెప్పాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హత్య కుట్ర వివరాలతో మెయిల్ పంపిన ఆ ఆగంతుకుడు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. అప్పుడే మోదీ హత్య కుట్ర వివరాలు బయటకు రావనీ అన్నాడు.
ఆగంతుకుడి మెయిల్ తో అలర్టైన ఎన్ఐఏ….అన్ని భద్రతావిభాగాలు, సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలకూ దాన్ని పంపింది. మెయిల్ అడ్రస్ కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలోనూ పలుమార్లు మోదీని చంపేస్తామంటూ హెచ్చరికలు వచ్చాయి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)