గుజరాత్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అప్పుడే రాజకీయ సభలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ ఇంకా నిద్ర నుండి లేవ లేదు కానీ దాని స్థానం
అక్రమించాలి అని చూస్తున్న కేజ్రీ మాత్రం అప్పుడే అన్ని
ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు.
ఢిల్లీ, పంజాబ్ ప్రజలు ఉచిత హామీలకు అశపడి ఆప్ ని గెలిపించారు అనే భ్రమలో ఉన్న కేజ్రీ తన గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కూడా ఉచిత విద్యుత్ హామీ ఇస్తున్నాడు.
ఆప్ ని గెలిపిస్తే రైతులకు ఉచిత విద్యుత్, గృహాలకు కొన్ని యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ ఇస్తాం అనే హామీని అన్ని సభల్లో చెపుతున్నాడు.
దానికి విరుద్ధంగా మోడీ….
మీకు విద్యుత్ ఉచితంగా రావడమే కాదు పైన డబ్బులు సంపాదించే మార్గం కూడా చెపుతాను అంటూ కేంద్రం గృహాల్లో,. పొలాల్లో పెట్టుకునే చిన్న సోలార్ ప్లాంట్స్ కి
భారీగా సబ్సిడీ ఇస్తోంది, మీరు ఆ ప్లాంట్స్ పెట్టుకుంటే మీకు విద్యుత్ ఉచితంగా రావడమే కాదు, మీ అవసరం
కంటే ఎక్కువ ఉత్పత్తి అయిన విద్యుత్ ప్రభుత్వానికి అమ్మి ఆదాయం కూడా పొందవచ్చు అని మోడీ అందరినీ ప్రోత్సహిస్తున్నారు.
దీర్ఘ కాలిక లబ్ధి కోసం ఆలోచనలు చేసేవారు, తాత్కాలికంగా లబ్ధి పొందాలి అనుకుని దీర్ఘకాలంలో నష్టం కలుగ చేసే హామీలు ఇచ్చే వారు. నాయకత్వంలో తేడా సుస్పష్టం. ఢిల్లీ ముఖ్యమంత్రి ఐఐటీ చదివితే ప్రధాని సాధారణ డిగ్రీ చదివారు.
….చాడా శాస్త్రి…