ఔరంగాబాద్ను శంభాజీ నగర్గా మారుస్తానని తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే చేసిన వాగ్దానాన్ని మరిచిపోలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం అన్నారు.
మా ప్రతి ఊపిరిలోనూ హిందుత్వం ఉంది.. ఔరంగాబాద్కు శంభాజీ నగర్గా పేరు పెడతానని మా నాన్న దివంగత బాలాసాహెబ్ ఠాక్రే హామీ ఇచ్చారు, దానిని నేను మరచిపోలేదు..తప్పక పేరు మారుస్తాం అని ఆయన అన్నారు.
దివంగత బాలాసాహెబ్ ఠాక్రే వాగ్దానం చేసినందున ఔరంగాబాద్ పేరు మార్చాలని బీజేపీ ఠాక్రేపై ఒత్తిడి తెస్తోంది. అయితే కాంగ్రెస్, ఎన్సిపి మద్దతుతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తోంది శివసేన. దీంతో వారి కారణంగా వెనకడుగు వేస్తోంది.
బీజేపీను ఉద్దేశించి.. జమ్మూ కశ్మీర్ గురించి మాట్లాడుతూ, మీకు ధైర్యం ఉంటే వెళ్లి కశ్మీర్లో హనుమాన్ చాలీసా పఠించండి’ సవాల్ విసిరారు. హిందుత్వం కోసం శివసేన ఏం చేసిందో.. బీజేపీ ఏం చేసిందో ముంబైలో బహిరంగంగా చర్చిద్దామని అన్నారు.
నూపుర్ శర్మ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ…,మబీజేపీ ప్రతినిధి ప్రకటన కారణంగా దేశం అవమానాలను ఎదుర్కోవలసి వచ్చిందన్నారు. మహారాష్ట్రలోనూ బీజేపీ సమస్యలు సృష్టిస్తోందన్నారు.
“ఈడీ, సీబీఐని మా వెంటే పరిగెత్తడం కంటే, జమ్మూకశ్మీర్ లో కాశ్మీరీ పండిట్ల పరిస్థితిపై దృష్టి పెట్టండి” అనిఠాక్రే హితవు పలికారు.
‘శివలింగం’పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ఠాక్రే తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ప్రతి మసీదులో ‘శివలింగం’ కోసం వెతకాల్సిన అవసరం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు. మంగళూరు వంటి కొన్ని చోట్ల మసీదులను సర్వే చేయాలని కోరుతూ కోర్టుల్లో వరుస పిటిషన్లు దాఖలైన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.