ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు ఇస్లామిస్ట్ గ్రూప్ ఐఎస్ఐఎస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ISIS కాశ్మీర్ నుంచి “మేము నిన్ను ,మీ కుటుంబాన్ని చంపబోతున్నాం” అని మెయిల్ వచ్చింది.
దీంతో జిహాదీ గ్రూపులనుంచి తనకు ప్రాణహాని ఉందంటూ గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. గంభీర్ ఈస్ట్ డిల్లీ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన అఫీషియల్ మెయిల్ ఐడీకి బెదిరింపు మెయిల్ వచ్చింది.
ఈ విషయమై సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ ఎన్ఐఏతో మట్లాడారు. గంభీర్ లిఖిత పూర్వక ఫిర్యాదును స్వీకరించామని..ఆయన ఇంటి వెలుపల భద్రతను పెంచామని ఆమె తెలిపారు. మెయిల్ మూలాలను తెలుసుకోవడానికి పోలీసులు ఫిర్యాదును స్పెషల్ సెల్లోని సైబర్ సెల్కు కూడా పంపారు. ఢిల్లీ పోలీసులు కూడా ప్రాథమిక విచారణ ప్రారంభించారు. కశ్మీర్ లోని సాయుధ బలగాలకు గంభీర్ సంఘీభావం తెలిపాడు. దేశంలో కల్లోలం రేపే కుట్ర చేస్తున్న ఉగ్రవాద గ్రూపులు, వాటికి మద్దతిస్తున్న పాకిస్తాన్ తీరును గంభీర్ బహిరంగంగా విమర్శించారు.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్దూ “బడా భాయ్” అని సంబోధించడాన్నీ గంభీర్ తప్పుపట్టారు. మీ కొడుకు లేదా కూతుర్ని సరిహద్దుకు పంపండి, ఆప్పుడు ఉగ్రవాద దేశాధినేతను మీ పెద్ద అన్నయ్య అని పిలవండి అని చురకేస్తూ ట్వీట్లు చేశారు.
కశ్మీరీ పండిట్ అయిన జర్నలిస్ట్ ఆదిత్యరాజ్ కౌల్ కు ఇలాంటి బెదిరింపు మెసేజులే వచ్చాయి. నీ తల నరకడం మాత్రమే మిగిలి ఉంది అని మెయిల్ వచ్చింది. దీంతో ఆదిత్యరాజ్ యూపీ, డిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మా తదుపరి లక్ష్యం నువ్వే…త్వరలోనే నిన్ను చంపబేతున్నాం అంటూ వరుస మెసేజ్ లు పంపారు ఆదిత్యరాజ్ కు. నువ్వు ఎక్కడ ఉంటున్నావ్..ప్రస్తుతం ఎక్కడున్నావ్ లాంటి వివరాలన్నీ మా దగ్గరున్నాయి. నీ తల నరికేయడానికి ఇదే సమయం అని ఉగ్రవాదులు హెచ్చరించారు.
ఇక ఐసిస్ మౌత్ పీస్ వాయిస్ ఆఫ్ హింద్ ..భారతదేశంలోని హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేస్తామని బెదిరించింది. మాగ్జైన్ కొత్త ఎడిషన్ పై ధ్వంసమైన శివుడి విగ్రహం ఫొటోను ప్రచురించింది. ఫొటో కింద..ఫేక్ దేవుళ్లను విచ్ఛిన్నం చేసే సమయం ఇదే…It is time to break fake gods అని ఉంది.
ఆదిత్య రాజ్ కౌల్ కశ్మీర్ వేర్పాటు వాదం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా గళం విప్పారు. దీంతో ఇస్లామిక్ టెర్రరిస్టులు అతనిపై పగపట్టారు. అయితే ఇటీవల పౌరులను లక్ష్యంగా ఉగ్రవాదులు వరుస హత్యలు చేసిన నేపథ్యంగా ఈ బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి.