జాతీయ జెండాను ఎగురవేసేందుకు క్రైస్తవం అనుమతించదు.. మేం మా దేవునికి మాత్రమే నమస్కరిస్తామని తెగేసి చెప్పింది తమిళనాడుకు చెందిన ఓ ప్రధానోపాధ్యాయురాలు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేసేందుకు తమిళసెల్వి అనే ప్రధానోపాధ్యాయురాలు నిరాకరించారు. క్రిస్టియన్ అయిన తాను అలా చేయడం తన మతానికి విరుద్ధమని చెప్పింది. ఆమె తీరు వివాదాస్పదమైంది. విద్యాశాఖాధికారి వరకు వెళ్లింది. దీంతో విచారణకు ఆదేశించారు.
ఆమె ఈ ఏడాది ఆమె పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆగస్ట్ 15 న ఆమెకు పాఠశాలలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఆరోజు జెండావందనానికి ఆమె నిరాకరించారు. దీంతో అసిస్టెంట్ హెడ్ మాస్టర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతటితో ఆగని ఆమె…. తన మతపరమైన నమ్మకాల కారణంగా తాను జాతీయ జెండాకు గౌరవ వందనం చేయలేనని వాదించింది. మేం మా దేవునికి మాత్రమే నమస్కరిస్తాం.. మరెవరికీ కాదు. మేం జెండాను గౌరవిస్తాం, కాని మేం దేవునికి మాత్రమే నమస్కరిస్తామని ఆమె అన్నారు. అయితే ఇన్నేళ్లలో ఏనాడూ ఆమె పాఠశాలలో జెండావందనం కార్యక్రమానికి హాజరుకాలేదని తెలిసింది. ప్రధానోపాధ్యాయురాలు అయి ఉండీ…. ప్రతిసారీ ఏదో ఒక అనారోగ్య కారణం చూపుతూ ఆ రోజు పాఠశాలకు గైర్హాజరయ్యేదని చెబుతున్నారు.