హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్నాటకలోని హిందూ విద్యార్థినుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తున్నాయి. హిజాబ్ అనేదే వివక్షాపూరితమైనదని…ముస్లింలు, ముస్లిమేతరులుగా తమను విభజిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రెస్ కోడ్ ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. నిన్నామొన్నటిదాకా తమతో కలిసి ఉన్న స్నేహితులు కొత్తగా హిజాబ్ ఉండాలంటూ రాద్దాంతం చేయడాన్ని చూసి షాకయ్యామని ఉడుపి కాలేజీ విద్యార్తులంటున్నారు. క్లాసులో అందరూ కలిసి కూర్చున్నారంటే సమానత్వ భావన ఉండాలి.. మేమంతా ఒకటే అనుకుని నిన్నామొన్నటి వరకూ అలాగే ఉన్నాం. వాళ్లు ముస్లింలు కనుక వేరు అని మేం ఎన్నడూ అనుకోలేదు. కానీ కొత్తగా వాళ్లు మొండిగా వ్యవహరిస్తుండడం బాధనిపిస్తోందని మీడియాతో వారన్న మాటలు ప్రతిఒక్కరినీ ఆలోచింపచేస్తున్నాయి. కొత్తగా కొందరు విద్యార్థులు హిజాబ్ ధరించి రావడం మొదలుపెట్టారు. ఈ కొత్త సంస్కృతిని మేం నిరసిస్తున్నామని చెబుతున్నారు.
యూనిఫాం మార్గదర్శకాలను ఉల్లంఘించేలా ముస్లిం విద్యార్థులను రెచ్చగొట్టడాన్ని నిరసిస్తూ ..స్థానిక పౌరులు, ముఖ్యంగా హిందూ సమాజం బాధ్యతగా వ్యవహరిస్తోంది. దీంతో కర్నాటకలో హిజాబ్ వివాదానికి త్వరలో తెరపడే అవకాశం కనిపిస్తోంది.
PFI , జమాతే ఇస్లామీ హింద్ మద్దతుతోనే ముస్లిం విద్యార్థులు యూనిఫాం డ్రెస్ కోడ్ నిబంధనలను ఉల్లంఘించినట్టు స్పష్టమైంది. తరగతి గదిలో బుర్ఖా, హిజాబ్ ధరించాలని వాళ్లే ప్రేరేపించినట్టు జరిగిన ప్రచారం నిజమని నమ్మక తప్పని పరిస్థితి. ఉడిపిలోని కళాశాల ప్రిన్సిపల్ ఇతర అధికారులు డ్రెస్ కోడ్ అనుసరించాలని విజ్ఞప్తి చేసినా వాళ్లు అంగీకరించకపోవడానికి కారణం ఒత్తిడే . దీనికి ప్రతిగానే హిందూ విద్యార్థులు సైతం నిరసనకు దిగారు. మత ప్రాతిపదికన ముస్లిం అమ్మాయిలకు డ్రెస్ కోడ్కు మినహాయింపు ఇస్తే, తామూ కాషాయ కండువాతో వస్తామంటూ వచ్చారు.
మగపిల్లలు ఏడిపిస్తున్నారనే హిజాబ్ ధరిస్తున్నామని కొందరంటున్నారు… మరి ఆడపిల్లలమైన మాకు రక్షణలేదా అని హిందూ బాలికలు ప్రశ్నిస్తున్నారు. కోర్టు న్యాయాన్ని సమర్థిస్తుందని, ముస్లింల పట్ల పక్షపాతం చూపదని తాము ఆశిస్తున్నామని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం యువతులు కళాశాల వెలుపల హిజాబ్లు, బురఖా ధరిస్తే తామేం అభ్యంతరం చెప్పడం లేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. కానీ క్యాంపస్లో మాత్రం అందరికీ ఒకే డ్రెస్ కోడ్ ఉండాలని వారు నొక్కి చెబుతున్నారు.
“వాళ్లు మా స్నేహితులు. వాళ్లని హిజాబ్ ధరించనివ్వండి, మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ, క్యాంపస్, క్లాస్ లోపల వాటిని ధరించడానికి అనుమతించకూడదు. మేము వారిని గౌరవంగా, సమానత్వంతో చూస్తాం.. మాతో ఉన్నవాళ్లను హిందువులుగానో ముస్లింలుగానో మేం చూడం. మనం ఎప్పుడైనా వారిని మతం ఆధారంగా వేరు చేశామా? లేదు కదా మరి ఇప్పుడు హిజాబ్ అంటూ ఎందుకు వారు వేరుగా చూస్తున్నారు, వారు వేరవుతున్నారని ఉడిపి కాలేజీ విద్యార్థులు అంటున్నారు. వారు హిజాబ్తో వస్తే, మా మతాన్ని అనుసరించే హక్కు మాకు కూడా ఉంది కాబట్టి మేము కూడా చీరలు ధరిస్తాం. వారు నిబంధనలు పాటిస్తే మేం కూడా పాటిస్తాం.. మేమంతా సమానమే అని పాఠశాల యంత్రాంగంతోను స్పష్టంచేశారు.