దేశంలోని న్యాయవాదులను బెదిరిస్తూ ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ ఫోన్ కాల్స్, మెసేజ్ లు చేసిన సంగతి తెలిసిందే. యూఎస్ఏ నుంచి ఈ కాల్స్ వచ్చాయి. అందులో పంజాబ్ పర్యటనలో మోదీని అడ్డుకుని తీరుతాం అని ఉంది. న్యాయవాదులకు ఇలా బెదిరింపు కాల్స్, మెసేజులు వస్తున్నాయనే విషయం బయటకు వచ్చిన కొన్ని గంటలకే కాల్స్ కు సంబంధించి ట్రాన్స్కిప్ట్ వెలువడింది. ప్రియాంక పాండే అనే సోషల్మీడియా యాక్టివిస్ట్ యూకేలో రిజిస్టర్ అయిన ఆ నెంబర్ వివరాలను ట్వీట్ చేశారు, ఆ నెంబర్ నుంచే పలువురు న్యాయవాదులకు సిఖ్ ఫర్ జస్టిస్ పేరుతో బెదిరింపు కాల్స్ వచ్చాయి, రికార్డ్ చేసిన వాయిస్ మెసేజ్ వచ్చింది.
‘సిక్కు రైతుల ప్రాణాలు పోయినా మీరు మౌనంగా ఉన్నారు. అయినా మీరు మోదీకి సపోర్టుగా ఉన్నారంటే అంతకన్నా అవమానకరం మరోటి లేదు. యూఎస్ఏ నుంచి సిఖ్స్ ఫర్ జస్టిస్ తరపున మేం పిలుపునిచ్చాం. పంజాబ్ లో మోదీని అఢ్డుకున్నది మేమే ‘ అని ఉంది. అందరికీ ఒకేసారి ఆ రికార్డ్ వచ్చింది.
2021 జనవరి 26న గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఎర్రకోట దగ్గర జరిగిన అల్లర్లకు SFJ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ సైతం ఓ వీడియో షేర్ చేస్తూ… పంజాబ్ లో మోదీ కాన్వాయిని అడ్డుకుని వెనక్కి పంపామని అన్నారు,