కేరళకు చెందిన 24 ఏళ్ల మాజీ మౌలానా అస్కర్ అలీ ఇస్లాంను వీడాడు. ఫలితం కుటుంబసభ్యులే దాడి చేశారు. అయితే తన కుటుంబసభ్యులు ఎలా బెదిరించిందీ చెప్పుకుంటూ వాపోతున్నాడు అలీ. ఆర్మీలో చేరాలన్నది తన కల అని…అయితే ముస్లింలు ఆర్మీలో చేరవద్దని, అది ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని తనవాళ్లు భయపెట్టారని అతను చెప్పాడు. అంతే కాదు ఇతర మతాల వారినీ ద్వేషించాలని తనకు నూరిపోశారని అంటున్నాడు అలీ.
ముస్లింలు తమ భావజాలాన్ని ఇతర కమ్యూనిటీలకు కూడా వ్యాప్తి చేయాలని చూస్తున్నారు. అది చాలా ప్రమాదకరం. ఇస్లాం అంటే నిజమైన ఫాసిజం అని అలీ అన్నాడు.
తన బంధువులు తనను వేధిస్తున్నారని … కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని అలీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ” కుటుంబ విషయాల గురించి మాట్లాడే నెపంతో ఇద్దరు బంధువులు వచ్చి బీచ్కు తీసుకెళ్లారు. తర్వాత కారులో వచ్చిన మరికొందరి సాయంతో నన్ను బలవంతంగా వాహనంలో ఎక్కించుకునే ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తి నా మొబైల్ను ధ్వంసం చేశాడు. నేను గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ప్రజలు అక్కడికి వచ్చి పోలీసులకు ఫోన్ చేశారు” అని తెలిపాడు.
మే 4న, 24 ఏళ్ల అక్సర్ ఇస్లాంను విడిచిపెట్టినందుకు ముస్లిం గుంపు దాడికి పాల్పడ్డారు. కొల్లం పోలీసులకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశాడు. తాను ఇస్లాంను విడిచిపెట్టిన తర్వాత ఆ గుంపు తనపై దాడి చేసిందని, ముస్లిం కమ్యూనిటీ నుంచి బెదిరింపులు ఆగడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.