సరిహద్దులతో పాటు దేశంలోని అంతర్గత సవాళ్లను ఎదుర్కొనేందుకు సైన్యం ఎప్పటికప్పుడు సంసిద్ధంగానే ఉందని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అన్నారు. అందుకు అనుగుణంగా సాయుధ దళాల్లో సంస్కరణలు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నే ఉన్న ఆయన…దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నారు. కేంద్రం తాజాగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పై నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ..అంతర్గతంగా ముప్పు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.అటు ఆందోళనల నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్ నాథ్ ఉన్నతస్థాయి అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. మనోజ్ పాండే హైదరాబాద్లో ఉన్నందున హాజరుకాలేకపోయారు.