ఈనెల 17 నుంచి కర్తార్ పూర్ కారిడార్ ను తిరిగి తెరవనున్నట్టు హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. కోవిడ్ కారణంగా 2020 మార్చిలో యాత్రను రద్దు చేశారు.. ”కర్తార్పూర్ గురుద్వారా దర్శించాలనుకునే సిక్కు యాత్రికులందరికీ ప్రయోజనం చేకూర్చే కీలక నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం తీసుకుంది. ఈనెల 17 నుంచి కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ను తెరుస్తున్నాం. గురునానక్ దేవ్ పట్ల, సిక్కు కమ్యూనిటీ పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న ఆరాధనాభావానికి ఇదే నిదర్శనం ‘ అని అమిత్ షా ట్వీట్ చేశారు. రెండు రోజుల క్రితం పంజాబ్ బీజేపీ నేతలు మోదీని కలిసి గురుపూరబ్కు ముందే కర్తార్పూర్ కారిడార్ను తెరవాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 19న గురునానక్ జయంతిని గురుపూరబ్గా జరుపుకొంటారు. పంజాబ్ ఎన్నికలు దగ్గరపడుతుండటం, కర్తాక్పూర్ సాహిబ్ కారిడార్ను తెరవాలంటూ కాంగ్రెస్, అకాలీదళ్ సహా అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
మరోవైపు కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాను నవంబరు 18న సందర్శించే తొలి బృందంలో పంజాబ్ కేబినెట్ మంత్రులు ఉంటారని ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్ని చెప్పారు. కర్తార్పూర్ కారిడార్ను తెరవాలనుకుంటున్నట్టు అమిత్ షా చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు.