కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతి…చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ భారత ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి పూర్తి స్థాయి సంసిద్ధతతో ఉన్నామని తెలిపారు. ఆర్మీ వైద్యాధికారులు, విశ్రాంత వైద్యాధికారుల సేవలను వినియోగించుకునేందుకు భారత సైన్యం సిద్ధమైంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని కోవిడ్ బాధితులకూ సేవలు అందించేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉంది. దేశం సమిష్టిగా కరోనాపై పోరాడుతుంది…కరోనాను భారత్ ఓడిస్తుందని ఈసందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు.