రైస్ బకెట్ చాలెంజ్, ప్లాంట్ ఎ ట్రీ చాలెంజ్ తరహాలో నీటి తొట్టె చాలెంజ్ విసురుతున్నాడు ఆదిలాబాద్ కు చెందిన జక్కుల వెంకటేశ్ అనే వ్యక్తి.
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. మరో రెండు నెలలు ఇంకాభానుడి ప్రతాపాన్ని తట్టుకోవాల్సిందే. ఇక ఎండలు ఈ స్థాయిలో దంచి కొడుతుండడంతో పశుపక్ష్యాదులు సైతం విలవిల్లాడుతున్నాయి. దీంతో కొందరు జంతు ప్రేమికులు వాటి దాహం తీర్చేందుకు ముందుకు వస్తున్నారు. ఎక్కడికక్కడ నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తూ నీళ్లు, ఆహారం అందుబాటులో ఉంచుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అయితే అందరికీ నీటితొట్లు పంచుతున్నాడు. నీటి తొట్టె చాలెంజ్ అంటూ పిల్లలు, పెద్దలకు వాటిని ఇస్తూ… చాలెంజ్ విసురుతున్నాడు. స్నేహితులకు సవాల్ చేయాలని కోరుతున్నాడు. తద్వారా అన్ని ప్రదేశాల్లో ఉన్న పక్షులను కాపాడినట్టు అవుతామని సందేశం ఇస్తున్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)