పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకసారి వాడిపడేసే కొన్ని ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా జులై 1 నుంచి నిషేధం అమల్లోకి రానుందని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక నుంచి వాటి తయారీ, దిగుమతి, వాడకం ఉండదు. ఒకేసారి వాడి పడేసే, తక్కువ పరిమాణంలో ఉన్న వస్తువులను నిషేధించారు. వాటిలో ప్లాస్టిక్ జెండాలు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, కత్తులు, స్పూన్లు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్ కు వాడుతున్న పల్చటి ప్లాస్టిక్, ఇయర్ బడ్స్, క్యాండీ స్టిక్ట్, ఐస్ క్రీమ్ పుల్లలు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్ల లోపు ఉండే ప్లాస్టిక్ , పీవీసీ బ్యానర్లు ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ఒకేసారి వాడిపడేసే పలు వస్తువులను నిషేదిస్తున్నట్టు పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.