హైదరాబాద్ లో వేల కోట్ల రూపాయల భూమి మాయం..
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో భూముల రేట్లు కోట్లలో ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఊపు అందుకోవడంతో రేట్లు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతంలో 750 ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డు లాగేసుకుంది. ఈ భూమి తమదే అంటూ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేసింది. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు, కష్టార్జితంతో కొనుక్కున్న ప్లాట్లు …. ఒక్క దెబ్బతో గల్లంతు అయిపోయాయి.
ప్రస్తుతం అమలులో ఉన్న వక్ఫ్ చట్టం ప్రకారం.. దేశం లో ఎక్కడైనా భూమి మీద వక్ఫ్ పెద్దల కళ్ళు పడితే చాలు. ఆ భూమి తమదే అంటూ వక్ఫ్ బోర్డు ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఆ వెంటనే సదరు భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లావాదేవీలు నిలిచిపోతాయి. ఆ భూమి యజమాని వక్ఫ్ బోర్డు అంటూ నిర్ధారణ అయిపోతుంది. సంబంధిత భూముల అసలు ఓనర్లు .. కోర్టు ల చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగి,, న్యాయ పరంగా పోరాడి వెనక్కి తెచ్చుకోవాలి. అదృష్టం బాగుంటే భూమి వెనక్కి వస్తుంది లేదంటే అంతే సంగతులు..!
మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతంలో కూడా జరిగింది అదే. 100కు పైగా సర్వే నంబర్ల నుండి 750 ఎకరాల భూమి తమదే అంటూ వక్ఫ్ బోర్డు రాత్రికి రాత్రి బోర్డు పెట్టేసింది. మౌలాలి, ఆర్టీసీ కాలనీ, శ్రీకృష్ణ నగర్ , సీతారాం నగర్, ఎస్బిహెచ్ కాలనీ , సఫిల్ గూడ వంటి హైదరాబాద్కు నగరంలోని ప్లాట్ అన్నీ ఒక్క దెబ్బలో గల్లంతైపోయాయి. వక్స్ బోర్డు లేఖ రాయడంతో ఈ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ లను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. జీవితాంతం కష్టపడి కూడబెట్టిన డబ్బుతో ఫ్లాట్స్ కొనుక్కున్న మధ్య తరగతి ప్రజలు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. 750 ఎకరాల భూమి తమదే అని స్థానికులు ఎంత మొత్తుకుంటున్నా పట్టించుకునే పరిస్థితి లేదు.
పార్లమెంటులో వక్ఫ్ బోర్డు చట్టానికి సవరణలు వస్తే తప్ప ఇటువంటి కష్టాలు తీరేది లేదు ఆ విషయాన్ని ప్రజలంతా గ్రహించాలి.