వక్ఫ్ బోర్డు ల పేరతో జరుగుతున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. 1994 నాటికి కేవలం 50వేల ఎకరాలకు మాత్రమే పరిమితం అయిన వక్ఫ్ ఆస్తుల విలువ కేవలం పాతిక ముఫ్పై ఏళ్లలోనే 9 లక్షల ఎకరాలకు చేరిపోయింది. మరో 8 లక్షల ప్రాపర్టీలను సొంతం చేసుకొంది. దీనిని బట్టి వక్ఫ్ బోర్డు పేరుతో సాగుతున్న అరాచకాలు అర్థం అవుతాయి. కేవలం 30 కుటుంబాల చేతుల్లోనే ఈ ఆస్తులన్నీ పోగుపడిపోయి ఉన్నాయి. వీటిని ముస్లిం సమాజం అంతటికీ అందించేందుకు ఉద్దేశించినవే వక్ఫ్ బోర్డు సంస్కరణలు. ఈ కొత్త వ్యవస్థలోని వాస్తవాలు ఇప్పుడు చూద్దాం.
..
ప్రచారం1)
మైనార్టీల హక్కులకు భంగం కలుగుతుంది. మత విషయాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకొంటాయి.
వాస్తవం )
మత పరమైన విషయాల్ని ఎక్కడా ఈ కొత్త చట్టం టచ్ చేయటం లేదు. ముస్లింల మత వ్యవహారాలు అలాగే కొనసాగుతాయి.
……………..
ప్రచారం 2)
వక్ఫ్ సవరణల ద్వారా వక్ఫ్ బోర్డులు రద్దు అవుతాయి, ప్రభుత్వాలే మొత్తం టేకోవర్ చేసేస్తాయి.
వాస్తవం))
వక్ఫ్ బోర్డు లను రద్దు చేయాలని ఎక్కడా ప్రతిపాదించలేదు. వక్ఫ్ విధానాల్లో సంస్కరణలు కోరుతున్నారు తప్పితే, వక్ఫ్ బోర్డులు కొనసాగుతాయి. వాటి పరిపాలన, విధానాలు అలాగే ఉంటాయి.
………………
ప్రచారం 3))
వక్ఫ్ బోర్డు భూములన్నీ ప్రభుత్వాలు లాగేసుకొంటాయి, ముస్లింల ఆస్తులు లాక్కొనే కుట్ర ఇది.
వాస్తవం ))
ఇది పూర్తిగా తప్పు. వక్ఫ్ బోర్డు తమ భూములను లీగలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధారాలు చూపించుకోవటం ద్వారా వాటిని చట్ట బద్దం చేసుకోవచ్చు.
…………….
ప్రచారం 4))
అన్ని ముస్లిం దేశాల్లోనూ వక్ఫ్ బోర్డు కి స్వేచ్ఛ ఉంటుంది, భారత్ లో ఆ స్వేచ్ఛను చంపేస్తున్నారు.
వాస్తవం ))
ప్రపంచంలోని ఏ దేశం లోనూ ఇలాంటి వక్ఫ్ బోర్డులు, ఆస్తులు లేనే లేవు, ఒక్క భారత్ లోనే ఈ వ్యవస్థలు ఉన్నాయి.
……………
ప్రచారం 5))
వక్ఫ్ బోర్డు లో బీజేపీ పార్టీ సభ్యులను పెట్టేయాలన్న కుట్ర చేస్తున్నారు
వాస్తవం ))
వక్ఫ్ బోర్డు లో ఇప్పుడు మెజార్టీ కులస్తులే ఉంటున్నారు, బలహీన వర్గాలకు అవకాశం ఏర్పడుతుంది.
……………
ప్రచారం 6))
వక్ఫ్ బోర్డు మీద కోర్టుల పెత్తనం మొదలైపోతుంది.
వాస్తవం))
భారతదేశంలోని అన్ని వ్యవస్థ ల మీద కోర్టుల అజమాయిషీ ఉంటుంది.
……………
ప్రచారం 7))
వక్ఫ్ సవరణల ద్వారా మొత్తం ముస్లింల ఆస్తులు లాగేసుకొంటారు
వాస్తవం))
అసలు ఆస్తులు లాక్కోవటం అన్న మాటే ఇందులో లేదు. ఏ ఒక్కరి ఆస్తిలోనూ మార్పు రాదు
……………..
ప్రచారం 8)
రాజకీయ నాయకులను వక్ఫ్ బోర్డు లో పెట్టేసే కుట్ర చేస్తున్నారుస
వాస్తవం))
ఇప్పుడు ఉన్న బోర్డు లోనే ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ఉండాలని ఉంది, కొత్తగా నేతలను పెట్టడం ఎందుకు
……………
ప్రచారం 9))
వక్ఫ్ సవరణలతో పేద ముస్లింలకు తీరని అన్యాయం
వాస్తవం ))
ఇప్పటి దాకా పేద ముస్లింలకు వక్ఫ్ బోర్డు లో స్థానం లేదు, ఈ సవరణల ద్వారా పేదలకు న్యాయం కలుగుతుంది.
………….
ప్రచారం 10))
వక్ఫ్ సవరణలను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ధిక్కరించవచ్చు
వాస్తవం))
సవరణల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికే అధికారాలు వస్తాయి, అందుచేత అటువంటి పరిస్థితి తలెత్తక పోవచ్చు.
………….
ఇంతటి పారదర్శకమైన విధానాలను నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకొని వస్తోంది. అయినప్పటికీ కుహానా మేధావులు సోషల్ మీడియా లో అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. అందుచేత వాస్తవాలను గమనించినట్లయితే, ఇదంతా సమాజానికి మేలు చేసే చర్యలు అని అర్థం అవుతుంది.