సింగ్ సిద్దూ మూసేవాలా హత్యతో పంజాబ్ సర్కారు వెనక్కి తగ్గింది.వెనక్కి తీసుకున్న 424 మంది వీవీఐపీల భద్రతను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 7 నుంచి వీవీఐపీలకు సెక్యూరిటీ అందుబాటులోకి వస్తుందని పంజాబ్, హర్యానా హైకోర్టుకు తెలిపింది రాష్ట్ర సర్కారు. భద్రత తొలగింపుపై మాజీ మంత్రి ఓపీ సోనీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ విషయాన్ని కోర్టుకు చెప్పింది. జూన్ 6న ‘ ఆపరేషన్ బ్లూస్టార్’ వార్షికదినం కోసం భద్రతాసిబ్బంది అవసరం ఏర్పడిందని అందుకే వెనక్కి తీసుకున్నామని ప్రభుత్వం కోర్టుకు సంజాయిషీ ఇచ్చింది. వీవీఐపీలకు భద్రత ఉపసంహరించిన మరునాడే సింగర్ సిద్దూ హత్యకు గురయ్యారు. దీంతో సీఎం భగవంత్ మాన్ పై విపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలూ నిర్వహించారు. భద్రత ఉపసంహరణపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో యూ టర్న్ తీసుకుంది ప్రభుత్వం.