బీజేపీకి ఓటేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది… బీజేపీ మద్దతుదారులు ఎవరూ బయటకు రావద్దు… టీఎంసీకి చెందిన ఓ ఎమ్మెల్యే హెచ్చరికలివి. అందుకు సంబంధించి బీజేపీ పశ్చిమబెంగాల్ కో ఇన్ చార్జి, ఐటీసెల్ చీఫ్ అమిత్ మాలవ్యా విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది.
https://twitter.com/amitmalviya/status/1508633896296259586?s=20&t=kAkc0BdCi1fWm0Dam-Y5Mw
టీఎంసీ ఎమ్మెల్యే నరేన్ చక్రవర్తి బీజేపీ సపోర్టర్లను హెచ్చరిస్తున్నట్టు అందులో స్పష్టంగా ఉంది. అలాంటి ఎమ్మెల్యేలను సీఎం మమత ప్రోత్సహిస్తున్నారని మాలవ్య మండిపడ్డారు.బీజేపీకి ఓటేస్తే…వాళ్లు మళ్లీ కనిపించరని… ఓటు వేయకుంటే అక్కడే ఉండి ఏదన్నా ఉద్యోగమో, వ్యాపారమో చేసుకోవచ్చని…టీఎంసీ వారికి మద్దతుగా నిలుస్తుందని నరేన్ చక్రవర్తి వాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు స్పష్టంగా ఉంది.
అసన్సోల్ పాండవేశ్వర్ ఎమ్మెల్యే నరేన్ చక్రవర్తి. బీజేపీ ఓటర్లు, మద్దతుదారులను ఇలా బహిరంగంగానే బెదిరిస్తున్నారని… ఓటు వేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్న ఆయన నేరస్థుడు కాడా అని మాలవ్యా ప్రశ్నించారు. కటకటాల వెనక ఉండాల్సిన అలాంటి వాళ్లను మమత అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.
గతంలో దుర్గాపూర్ జిల్లా పరిషత్ సభ్యుడిగాను, పాండవేశ్వర్ బ్లాక్ టీఎంసీ అధ్యక్షుడిగా పనిచేశారు నరేన్. 2016లో మొదట సిఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది.ఓసారి ఆయుధాల చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. లైసెన్స్ లేని తుపాకీతో చెన్నె విమానం ఎక్కేందుకు ప్రయత్నించిన అతన్ని ఓసారి అదుపులేకి తీసుకున్నారు.
ఆసన్సోల్ లోక్సభ సీటుతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలో విబేధాల కారణంగా గత అక్టోబర్లో రాజీనామా చేసిన బాబుల్ సుప్రియో టీఎంసీలో చేరారు. టీఎంసీ నుంచి శతృఘ్నసిన్హాపోటీ చేస్తుండగా…బీజేపీ అగ్నిమిత్రపాల్ ను బరిలో దింపింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)