ఇటీవల కాలంలో లవ్ జిహాద్ పాపులర్ అయింది. స్వార్థం కోసం వేరే ఉద్దేశాలు మనసులో పెట్టుకుని అమ్మాయిలను ట్రాప్ చేసి, వారి జీవితాలను పక్కదారి పట్టించడమే లవ్ జిహాద్. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఉదంతాలు బయటపడ్డాయి. లవ్ జిహాద్ చేసేవారికి సమాజంలో గొప్ప పేరు ఉంటుందని ముందుగానే ఊరిస్తున్నారు దీంతో కొంతమంది యువకులు గుడ్డిగా అటువైపు పరుగులు తీస్తున్నారు.
తాజాగా పార్లమెంట్ ఎన్నికలవేళ ఓటు జిహాద్ అంటూ కొత్త నినాదం పుట్టుకొచ్చింది. అది కూడా బహిరంగంగా ఎన్నికల సభలో భాగంగా కాంగ్రెస్ నాయకులు ఇస్తున్న పిలుపు.
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు, సమాజ్వాదీ పార్టీ నేత మారియా ఆలం ఖాన్.. ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే ‘ఓట్ జీహాద్’ తప్పనిసరి అని ఫరూఖాబాద్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మతం పేరుతో ఆమె ఓట్లు అడగడంపై మారియా ఆలం ఖాన్ పై కేసు నమోదైంది.
ఆమె ప్రసంగం చాలా వివాదాస్పదంగా నడిచింది.
“అందరూ కలిసికట్టుగా ఉందాం. అంతా నిశబ్దంగా, సామూహికంగా ఓటు వేయాలి. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే ఓట్ల జీహాద్ ఒక్కటే మార్గం” అని ఫరూఖాబాద్ ఎన్నికల ర్యాలీలో మారియా ఆలం ఖాన్ పిలుపునిచ్చారు. సీఏఏ, ఎన్ఆర్సీకి సంబంధించి కేసులపైన, జైళ్లలో ఉన్న వారిని విడుదల చేసేందుకు సల్మాన్ ఖుర్షీద్ పోరాడుతున్నారని కూడా ఆమె చెప్పారు. దీంతో ఎఫ్ఐఆర్ లో సల్మాన్ ఖుర్షీద్ పేరు కూడా చేర్చారు.
అంతేకాకుండా.. ఫరూఖాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ముఖేష్ రాజ్పుఠ్ తరఫున ప్రచారం చేస్తున్న ముస్లిం కమ్యూనిటీకి చెందిన వారిపై కూడా మారియా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అనుచిత ప్రవర్తనకు తప్పనిసరిగా దేవుడు శిక్షిస్తాడని.. హెచ్చరికలు చేసింది.
ఇటు మారియా ప్రసంగం వీడియా సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా వైరల్ కావడంతో.. బీజేపీ వెంటనే స్పందించింది. ర్యాడికలిజాన్ని ఆమె ప్రోత్సహిస్తున్నారని మండిపడింది.
ఖుర్షీద్ ఎల్లప్పుడూ.. ముస్లీంలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఖుర్షీద్ మాట్లాడిన పాత వీడియోను.. రాష్ట్ర బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. అందులో పరిపాలనలో ముస్లింలకు ‘అధిక ప్రాతినిధ్యం’ కోసం వాదిస్తూ.. అలాంటి పాలనా యంత్రాంగాన్ని ఓట్లలోకి ఎలా ‘అనువదించుకోవచ్చో’ పార్టీ సహచరులకు ఖుర్షీద్ ఉపదేశమిస్తారు.
సల్మాన్ ఖుర్షీద్కి సంబంధించిన పాత వీడియోను షేర్ చేసిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా, మరియా ఖాన్.. తన మేనమామ నుంచి రాడికలిజం, మతోన్మాదం వారసత్వంగా పొందారని విమర్శించారు.
మే 2016లో వాట్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్, బ్రౌన్ యూనివర్శిటీ, రోడ్ ఐలాండ్లో ఖుర్షీద్ మాట్లాడుతూ, తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పట్టణ ప్రాంతాల్లోని జ్ఞానోదయం కలిగిన, ఆలోచనాపరులైన ముస్లింలను కాంగ్రెస్ ‘వెనక్కి తీసుకోవడం’ కోసం తాను సూచించిన విధానాన్ని ఆ పార్టీ ఎలా పాటిస్తుందో.. వివరించారని తెలిపారు.
నిజానికి సల్మాన్ ఖుర్షీద్ మొదటి నుంచి వివాదాస్పద నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడే… దేశానికి అంతటికి మంత్రిగా కాకుండా, ముస్లింలకు మాత్రమే మంత్రిగా ఉంటున్నారంటూ విమర్శలు వినిపించాయి . ది సన్ రైజ్ అయోధ్య పేరుతో ఆయన రాసిన పుస్తకం కలకలం రేపింది. హిందువుల మీద విద్వేషం రగిలించేందుకు ఈ పుస్తకంలో తీవ్రంగా ప్రయత్నించారనేది సుస్పష్టం. ఈ క్రమంలో సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు మరో అడుగు ముందుకేసి ఓటు జిహాద్ అంటూ మరో కుంపటి రగిలించారు.