దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న ప్రతి సందర్భంలోనూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయం సేవకులు తమకు తాముగా ముందుకు వచ్చి దేశాన్ని దేశ ప్రజలను ఆ విపత్కర పరిస్థితుల నుంచి బయట పడవేయడం లో విశేష కృషిని కలుపుతారు అన్న విషయం మనకు అనేక సందర్భాలలో రుజువైంది.
ఇప్పుడు తాజాగా కరోనా సెకండ్ వేవ్ తో దేశం అతలాకుతలమౌతున్న పరిస్థితులలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయంసేవకులు ముందుకు వచ్చి న భూతో న భవిష్యతి అన్న రీతిలో తమ సేవలను అందిస్తున్నారు. ఆ వివరాలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్ ఆన్లైన్ ప్రెస్ మీట్ ద్వారా మీడియాకు అందజేశారు. ఆ వివరాలను ఒకసారి వారి మాటలలోనే తెలుసుకుందాం……
“ఎప్పటిలాగే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, సేవా భారతి మరియు అనేక ఇతర సంస్థలు బాధిత ప్రాంతాలకు మరియు కుటుంబాలకు ఉపశమనం కలిగించడానికి పగలు, రాత్రి తేడాలేకుండా పనిచేస్తున్నాయి. సంఘ్ చొరవతో, పన్నెండు రకాల ప్రధానమైన, ముఖ్యమైన, ప్రాధాన్యమైన పనులు ప్రారంభించబడ్డాయి.
” ఈ ప్రకల్పాలలో – అనుమానిత కోవిడ్ రోగుల కోసం ఐసోలేషన్ కేంద్రాలు, కోవిడ్ పాజిటివ్ వ్యక్తుల కోసం కోవిడ్ కేర్ (సర్వీస్) కేంద్రాలు, ప్రభుత్వ నిర్వహణ కోవిడ్ సెంటర్లు మరియు ఆసుపత్రులలో సహాయం, టెలిఫోన్ హెల్ప్లైన్లు, రక్తదానం, ప్లాస్మా విరాళం, అంత్యక్రియలు నిర్వహించడంలో సహాయం, ఆయుర్వేద మరియు అలోపతీ మందుల పంపిణీ, కౌన్సెలింగ్, ఆక్సిజన్ సరఫరా మరియు అంబులెన్స్ సేవలు, ఆహారం, రేషన్ మరియు మాస్కుల పంపిణీ, టీకా ప్రచారం మరియు అవగాహన కార్యకలాపాలు అనేక రాష్ట్రాల్లోని స్వయంసేవకులు తక్షణమే అమల్లోకి తెచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో స్థానిక ప్రభుత్వ వర్గాలకు కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించబడుతున్నాయి.
“ఇండోర్లో, సంఘ్ చొరవతో, ప్రభుత్వం, ప్రైవేట్ ఆసుపత్రి మరియు రాధస్వామి సత్సంగ్ సహకారంతో, పెద్ద కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయబడింది. ఇది ప్రభుత్వ సమన్వయానికి అద్భుతమైన ఉదాహరణగా అవతరించింది” అని అంబేకర్ గారు అన్నారు.
ఆయన మాట్లాడుతూ, “ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు 43 ప్రధాన నగరాల్లో కోవిడ్ సేవా కేంద్రాలను నడుపుతున్నారు. కోవిడ్ ఆస్పత్రుల నిర్వహణకు 219 ఇతర ప్రదేశాలలోని స్వయంసేవకుల సహకారం ఉంది. టీకా కోసం పదివేలకు పైగా ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలతో ఇప్పటివరకు 2442 టీకా కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. ”
విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా శ్రీ అంబేకర్ మాట్లాడుతూ…..
“పూణేలో 600 ప్లాస్మా యూనిట్లను స్వయంసేవకులు అందుబాటులో ఉంచారు. ఇది 1500 మంది ప్రాణాలను రక్షించడానికి సహాయపడింది.
ఇది నిరంతర ప్రక్రియ. ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్న దాతల జాబితా ఇప్పటికే దేశవ్యాప్తంగా రాష్ట్ర మరియు స్థానిక స్థాయిలో తయారు చేయబడుతోంది. ”
“ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆహారానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్న సీనియర్ సిటిజన్లకు క్రమం తప్పకుండా భోజనం అందించడానికి వీలుగా క్షేత్ర స్థాయిలో బృందాలను ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసింది” అని అంబేకర్ మరొక ప్రశ్నకు సమాధానమిస్తూ చెప్పారు.
“ఈ పనిలో సమాజంలో ప్రతిఒక్కరి సహకారం అవసరం. ప్రభుత్వ వర్గాలు మరియు సమాజం యొక్క సమన్వయంతో భారత్ కరోనాతో ఈ యుద్ధంలో విజయం సాధిస్తుంది” అని శ్రీ అంబేకర్ పేర్కొన్నారు.