ఏపీ రాష్ట్ర రాజధానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపైనే చర్చ జరుగుతోంది. రాజధాని విశాఖేనని… త్వరలో తాను విశాఖ వెళ్లబోతున్నానంటూ ఢిల్లీ వేదిగ్గా జగన్ అన్న సంగతి తెలిసిందే. పెట్టుబడిదారులను విశాఖకు ఆహ్వానిస్తూ ఆ ప్రకటనచేశారు సీఎం. అయితే జగన్ ఈ ఒక్క మాటతో విశాఖపట్నం హ్యాష్ టాగ్ తో ట్విట్టర్ ట్రెండింగ్ లో నిలిచింది. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్న మాటలను జాతీయ మీడియా సైతం హైలైట్ చేసింది.
అయితే న్యాయస్థానాల పరిధిలో ఉన్న రాజధాని అంశంపై జగన్ ప్రకటన చేయడమేంటని కొందరంటున్నారు. ఇన్వెస్టర్లను విశాఖకు రావాలని, పెట్టుబడులు పెట్టాలని.. మార్చి 3-4 తేదీల్లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్కు ఆహ్వానిస్తూ జగన్ రాజధాని ప్రకటన చేశారు.