శుక్రవారం ప్రార్థనల తర్వాత దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు, ముస్లిం గుంపులు రాళ్లు విసరడం వంటి ఘటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు ఉన్నతాధికారులకు హోం శాఖ సూచించింది.
మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల కారణంగా సస్పెండ్ అయిన బీజేపీ నాయకులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన ప్రకటనలకు ప్రతిస్పందనగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక హింసాత్మక చర్యలు జరిగడంతో హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.
“శాంతి భద్రతల పరిస్థితిని నిర్వహించడానికి మోహరించిన పోలీసులను అలర్ట్ మోడ్లో ఉండాలని మేము ఆదేశించాం. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి పోలీసులు, అవసరమైతే పారామిలటరీ కూడా అలర్ట్ మోడ్లో ఉండాలి” అని MHA అధికారి తెలిపారు. ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న వ్యక్తులపై నిఘా ఉంచేందుకు పలు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. నివారణ చర్యలు తీసుకోవాలని.. సరిహద్దులను పర్యవేక్షించాలని.. హాని కలిగించే ప్రదేశాలను గుర్తించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అభ్యర్థించింది.
ఇంతలో నాయకుల వివాదాస్పద ప్రకటనలకు ప్రతిస్పందనగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, పంజాబ్, హైదరాబాద్ సహా గుజరాత్ అంతటా హింసాత్మక నిరసనలు చెలరేగాయి. బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేస్తున్న ప్రదర్శనకారులు నాయకులను అరెస్టు చేయాలని కోరడంతో జమ్మూలోని అధికారులు కొన్ని జిల్లాల్లో కర్ఫ్యూను అమలు చేశారు. కాశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాలు షట్డౌన్ అయ్యాయి, అయితే రాంచీలోని కొన్ని ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు జారీ చేశారు.
ఢిల్లీలోని జామా మసీదు వెలుపలకూడా పెద్ద ఎత్తున ఇస్లామిస్టులు గుమిగూడారు. ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్లో ఇదే విధమైన అల్లర్లు జరిగాయి. వేలాది మంది వీధుల్లోకి వచ్చి నూపూర్ శర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని గుమిగూడిన వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో ముస్లింలు పోలీసులపైకి రాళ్లు విసిరారు. అల్లర్లను అదుపుచేయడానికి పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జి ప్రయోగించారు.ఇంకా ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.