రామనవమి, హనుమాన్ జయంతి ఊరేగింపులపై భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో హింసాత్మక సంఘటనలు జరిగిన కొన్ని రోజుల తరువాత, గుజరాత్ లోని వడోదరలో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి.
ఆదివారం అర్థరాత్రి రెండు బైక్ల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదం కాస్త మతపరమైన ఉద్రిక్తతకు దారితీసింది. దాంతో కత్తులు పట్టుకున్న ముస్లిం గుంపు రాళ్లు విసిరి ఉద్రిక్తలకు దారితీశారు. దాదాపు 300-400 మంది గుంపుగా రోడ్లపైకి వచ్చి, రోడ్డుపై వస్తూ వెళ్తున్న వారిని.. డ్రైవింగ్ చేస్తున్న వారిని కొట్టినట్లు సమాచారం. సమీపంలో ఆలయంలోని సాయిబాబా విగ్రహాన్ని కూడా పగలగొట్టారు.
ఈ అల్లర్లలో నలుగురికి గాయాలు కాగా, 10 దుకాణాలు ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సాయాజీ ఆసుపత్రికి తరలించారు. వెంటనే పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపుచేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ప్రజలు ఆగ్రహం చెందారు. వారిని శాంతింపజేయడానికి సాయిబాబా విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్టించారు.
वडोदरा :
देर रात 2 वेहिकल के बीच टक्कर के बाद दो गुट के बीच बवाल मचा उसके बाद एक गुट ने दूसरे पर किया जबरदस्त पथराव।पास में एक छोटे मंदिर को भी निशाना बनाया गया।
घटना की जानकारी मिलने के बाद पुलिस फौरन मौके पर पहुंची औऱ स्थिति पर अंकुश लाया गया।@sanghaviharsh pic.twitter.com/sV0qrtoa5G
— Janak Dave (@dave_janak) April 18, 2022
ఒక నెటిజెన్ షేర్ చేసిన వీడియోలో ఒక గుంపు రాళ్లు విసరడం, హింసకు పాల్పడడం స్పష్టంగా కనిపిస్తోంది. అకస్మాత్తుగా భారీ గుంపు దాడి చేసిన తీరు, హింసకు పాల్పడటం ఇదంతా ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాళ్లు విసిరిన వ్యక్తులు స్థానికులు కాదని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉండవచ్చునని.. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర అని స్థానికులు ఆరోపిస్తున్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)