భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో వివాదాస్పదంగా నిలిచిన పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింస చెలరేగుతోంది. గత కొంతకాలంగా స్థానిక ప్రభుత్వం తీరు మీద అక్కడి ప్రజలు విసిగిపోయారు. పాకిస్థాన్ ప్రభుత్వం అడ్డగోలుగా తమను దోచుకుంటుందని అర్థం చేసుకున్నారు. దీంతో ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. సైన్యం రంగంలోకి దిగి ఆఆంక్షలు విధించినప్పటికీ పరిస్థితిలో అదుపు రావడం లేదు.
1967 లో జీలం నది మీద మంగళ ఆనకట్ట నిర్మించారు స్థానికుల భూములు వనరుల్ని వాడేసుకున్నారు దీనిమీద భారీగా జల విద్యుత్ ప్రాజెక్టు కట్టుకున్నారు అయితే ఈ విద్యుత్తును ఇక్కడ వచ్చే ఆదాయాన్ని మొత్తంగా పాకిస్తాన్ తీసేసుకుంటుంది స్థానిక ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఇవ్వడం లేదు మరోవైపు ఇక్కడ అడవుల్లోని చెట్లను నరికేసి కలపని పాకిస్తాన్ తరలించుకుంటున్నారు ఈ ఆదాయం కూడా పాక్ కే తరలిపోతోంది. గతంలో ఈ దోపిడీ అంతా గుట్టుగా ఉండేది.
కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కాశ్మీర్లో శాంతి కుసుమాలు వికసించాయి కాశ్మీర్ అభివృద్ధి రంగంలో ముందుకు వెళుతుంది కానీ పొరుగున ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ దుర్భరమైన బతుకును ఏడుస్తోంది ఇప్పటి తరం యువత ఈ విషయాన్ని గమనిస్తూ పిఓకే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు ఉద్యమం నడుపుతున్న అంజాద్ మీర్జా బహిరంగంగా ఒక ప్రకటన చేశారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితి చేయి దాటిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తమకు స్వాతంత్రం కల్పించాలని విజ్ఞప్తి చేశారు మొత్తం మీద పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితుల్ని భారత్ ఎప్పటికప్పుడు గమనిస్తోంది.